Political News

జగన్ పై కోర్టు ధిక్కార కేసు

అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి కోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి తదితరులపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. అమరావతి నగరాన్ని ఆరు మాసాల్లో నిర్మించాలని, అంతకుముందు రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అందించాలని కోర్టు మార్చి 3వ తేదీన తీర్పిచ్చింది. నిజానికి కోర్టు తీర్పు యధాతధంగా అమలు చేయడం సాధ్యం కాదని అందరికీ తెలిసిందే.

ఇదే విషయమై ప్రభుత్వం కూడా తీర్పు అమలు సాధ్యం కాదని ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ కోర్టు పరిశీలనలో ఉంది. తీర్పు అమలుకు తమకు 60 మాసాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తన అఫిడవిట్లో కోరింది. ఈ నేపధ్యంలోనే రాజధాని ప్రాంతానికి చెందిన ఇద్దరు రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు కోర్టులో ధిక్కార పిటీషన్లు వేశారు. ఇందులో వ్యక్తిగతంగా జగన్, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, శ్రీలక్ష్మి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.

గతంలో కోర్టు తీర్పిచ్చినట్లుగా ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో మౌళికసదుపాయాలు ఏర్పాటుచేయకుండా, ప్లాట్లను అభివృద్ధి చేయకుండా, రాజధాని నగరాన్ని నిర్మించకుండా కావాలనే తాత్సారం చేస్తున్నట్లు రైతులు తమ పిటీషన్లో ఆరోపించారు. కోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశ్యంలో ప్రభుత్వం లేదని రైతులిద్దరు ఆరోపించటం ఇక్కడ విచిత్రంగానే ఉంది. ఎందుకంటే కోర్పు తీర్పు అమలు సాధ్యంకాదని స్వయంగా ప్రభుత్వమే చెప్పిన తర్వాత మళ్ళీ అదే విషయాన్ని రైతులు తమ అఫిడవిట్లో ఆరోపించాల్సిన అవసరమే లేదు.

వాస్తవంగా చూస్తే నెల రోజుల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయటం కష్టం. అలాగే మూడునెలల్లో డెవలప్ చేసిన ప్లాట్లను రైతులకు ఇవ్వటం, ఆరు మాసాల్లో రాజధానిని నిర్మించటం జరిగే పని కాదు. అంటే కోర్టు తీర్పు ప్రకారం నెల రోజుల నుండి ఆరు మాసాల్లోగా అన్నీ జరిగిపోవాలంటే మరి నాలుగేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఎందుకు ఇవన్నీ చేయలేకపోయారు ?  ఏదేమైనా కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే. 

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

12 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago