Political News

స‌ల‌హాదారులు కావ‌లెను.. వైసీపీలో చ‌ర్చ‌!

ఏపీ అధికార పార్టీలో సంచ‌ల‌న మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. ఇటీవ‌ల కేబినెట్‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. తాజాగా స‌ల‌హాదారుల‌ను కూడా మార్చుకునేందుకు రెడీ అవుతున్నార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఉన్న 56 మంది స‌ల‌హాదారుల్లో ఓ ఐదారుగురు మిన‌హా.. మిగిలిన వారిని మార్చుకునేందుకు ఆయ‌న ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు. కేవ‌లం ఐదు లేదా.. ఎనిమిది మందిని మాత్ర‌మే కొన‌సాగిస్తార‌ని అంటున్నారు.

అయితే.. ఇలా ప‌క్క‌న పెట్టేవారికి.. క్షేత్ర‌స్థాయిలో మ‌ళ్లీ వ్యూహాత్మ‌క పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని.. చెబుతున్నారు. గ‌తంలో పార్టీకి అన్ని రూపాల్లోనూ సాయం చేసిన వారికి జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డిన వెంట‌నే.. ప్ర‌భుత్వంలో ఏదో ఒక రూపంలో భాగ‌స్వామ్యం క‌ల్పించారు. అయితే.. వీరిని మార్చుతాన‌ని ఆయ‌న ఎప్పుడూ..చెప్ప‌లేదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో.. స‌ల‌హాదారుల‌ను కూడా మార్చి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వారి సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని ఆయ‌న చూస్తున్నారు.

ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌లు అంత ఈజీగా అయితే.. ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అన్ని రూపాల్లోనూ పోటీ.. అన్ని వైపుల నుంచి పోటీ ఉంటుంది. దీంతో మేధావి వ‌ర్గాన్ని.. ముఖ్యంగా ఎన్నారై వ‌ర్గాన్ని కూడా వైసీపీ కూడ‌గ‌ట్ట‌డం ద్వారా.. ఎన్నిక‌ల్లో త‌మ‌కు అనుకూలంగా ఫ‌లితాన్ని రాబ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న స‌ల‌హాదారులను క్షేత్ర‌స్థాయిలో పార్టీ సేవ‌ల‌కు వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే.. ప్ర‌స్తుతం ఉన్న 56 మందిలో 30 స్థానాల‌కు కుదించి.. వారిలోనూ ఐదారుగురిని వినియోగించుకుని.. మిగిలి 20 స్థానాల్లో కొత్త‌వారిని నియ‌మించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో మీడియాచ‌ర్చ‌ల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న న్యాయ‌వాదులు.. ఇత‌ర‌త్రా వ‌ర్గాల‌కు స‌ల‌హాదారులుగా ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా.. పార్టీని ప‌రోక్షంగా బ‌లోపేతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. 

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

31 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

1 hour ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago