ఏపీ అధికార పార్టీలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. సీనియర్లు చెబుతున్నారు. ఇటీవల కేబినెట్ను పూర్తిగా ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి జగన్.. తాజాగా సలహాదారులను కూడా మార్చుకునేందుకు రెడీ అవుతున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 56 మంది సలహాదారుల్లో ఓ ఐదారుగురు మినహా.. మిగిలిన వారిని మార్చుకునేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కేవలం ఐదు లేదా.. ఎనిమిది మందిని మాత్రమే కొనసాగిస్తారని అంటున్నారు.
అయితే.. ఇలా పక్కన పెట్టేవారికి.. క్షేత్రస్థాయిలో మళ్లీ వ్యూహాత్మక పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని.. చెబుతున్నారు. గతంలో పార్టీకి అన్ని రూపాల్లోనూ సాయం చేసిన వారికి జగన్ సర్కారు ఏర్పడిన వెంటనే.. ప్రభుత్వంలో ఏదో ఒక రూపంలో భాగస్వామ్యం కల్పించారు. అయితే.. వీరిని మార్చుతానని ఆయన ఎప్పుడూ..చెప్పలేదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో.. సలహాదారులను కూడా మార్చి.. వచ్చే ఎన్నికలకు వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన చూస్తున్నారు.
ఎందుకంటే.. వచ్చే ఎన్నికలు అంత ఈజీగా అయితే.. ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని రూపాల్లోనూ పోటీ.. అన్ని వైపుల నుంచి పోటీ ఉంటుంది. దీంతో మేధావి వర్గాన్ని.. ముఖ్యంగా ఎన్నారై వర్గాన్ని కూడా వైసీపీ కూడగట్టడం ద్వారా.. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న సలహాదారులను క్షేత్రస్థాయిలో పార్టీ సేవలకు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం ఉన్న 56 మందిలో 30 స్థానాలకు కుదించి.. వారిలోనూ ఐదారుగురిని వినియోగించుకుని.. మిగిలి 20 స్థానాల్లో కొత్తవారిని నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో మీడియాచర్చల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న న్యాయవాదులు.. ఇతరత్రా వర్గాలకు సలహాదారులుగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. పార్టీని పరోక్షంగా బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on April 23, 2022 10:28 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…