ఏపీ అధికార పార్టీలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. సీనియర్లు చెబుతున్నారు. ఇటీవల కేబినెట్ను పూర్తిగా ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి జగన్.. తాజాగా సలహాదారులను కూడా మార్చుకునేందుకు రెడీ అవుతున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 56 మంది సలహాదారుల్లో ఓ ఐదారుగురు మినహా.. మిగిలిన వారిని మార్చుకునేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కేవలం ఐదు లేదా.. ఎనిమిది మందిని మాత్రమే కొనసాగిస్తారని అంటున్నారు.
అయితే.. ఇలా పక్కన పెట్టేవారికి.. క్షేత్రస్థాయిలో మళ్లీ వ్యూహాత్మక పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని.. చెబుతున్నారు. గతంలో పార్టీకి అన్ని రూపాల్లోనూ సాయం చేసిన వారికి జగన్ సర్కారు ఏర్పడిన వెంటనే.. ప్రభుత్వంలో ఏదో ఒక రూపంలో భాగస్వామ్యం కల్పించారు. అయితే.. వీరిని మార్చుతానని ఆయన ఎప్పుడూ..చెప్పలేదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో.. సలహాదారులను కూడా మార్చి.. వచ్చే ఎన్నికలకు వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన చూస్తున్నారు.
ఎందుకంటే.. వచ్చే ఎన్నికలు అంత ఈజీగా అయితే.. ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని రూపాల్లోనూ పోటీ.. అన్ని వైపుల నుంచి పోటీ ఉంటుంది. దీంతో మేధావి వర్గాన్ని.. ముఖ్యంగా ఎన్నారై వర్గాన్ని కూడా వైసీపీ కూడగట్టడం ద్వారా.. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న సలహాదారులను క్షేత్రస్థాయిలో పార్టీ సేవలకు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం ఉన్న 56 మందిలో 30 స్థానాలకు కుదించి.. వారిలోనూ ఐదారుగురిని వినియోగించుకుని.. మిగిలి 20 స్థానాల్లో కొత్తవారిని నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో మీడియాచర్చల్లో పార్టీకి అనుకూలంగా ఉన్న న్యాయవాదులు.. ఇతరత్రా వర్గాలకు సలహాదారులుగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. పార్టీని పరోక్షంగా బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on April 23, 2022 10:28 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…