మూడేళ్లు గడిచిపోయాయి. రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీల్లో ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది? ఎవరు ఏం చేస్తున్నారు? అనే చర్చ సహజంగానే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే.. అరకు ఎంపీగా తొలి విజయం అందుకుని.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించిన గొట్టేటి మాధవి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమె విద్యావంతురాలు.. గతంలో టీచర్ ఉద్యోగం కూడా చేశారు. అయితే.. రాజకీయంగా ఆమె సాధించింది పెద్దగా లేదని స్థానికులే చెబుతున్నారు.
గట్టి వాయిస్ లేదు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నప్పటికీ.. పార్లమెంటులో బలమైన గళం కూడా వినిపించలేదని చెబుతున్నారు. స్థానికంగా అరకులో 1/70 చట్టంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని తీ సేయాలనేది ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మాట. అదేసమయంలో గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. ఇక, ప్రసూతి వచ్చినా.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా.. నియోజకవర్గం నుంచి విశాఖ వస్తే.. తప్ప మెరుగైన వైద్య అందే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో అరకులోనే మెరుగైన సౌకర్యాలతో వైద్య శాలను ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. అయితే.. ఇవన్నీ.. చేస్తామని.. తనను గెలిపించాలని.. మాధవి హామీ ఇచ్చారు. అయితే.. దీనిని ఆమె మరిచిపోయారు. తన వివాహం పేరుతో ఏడాది పాటు ప్రజలకు దూరంగా ఉన్నారని..ఇక్కడి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత.. కరోనాపేరుతో అసలు కంటికి కూడా కనిపించలేదు. ఇక, ఇటీవల కాలంలో కరోనా తగ్గినా.. వ్యక్తిగత సమస్యలతో ఆమె గడప దాటి బయటకు రావడం లేదు.
ఈ పరిణామాలతో ఎంపీపై ఆశలు సన్నగిల్లుతున్నాయని అంటున్నారు. అయితే.. ఆమెపై వ్యతిరేకత లేకపోయినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదనే వాదన మాత్రంబలంగా వినిపిస్తోంది. వచ్చే రెండేళ్లలో అయినా.. తమకు చేరువగా ఉండాలని… గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఎంపీగారు.. ప్రజల మాట వింటారా.. లేదా.. చూడాలి. ఇక్కడ ఆమెకు కలిసి వస్తున్న అంశం ఏంటంటే.. ప్రతిపక్షం బలంగా లేక పోవడమే!!
This post was last modified on April 22, 2022 7:42 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…