మూడేళ్లు గడిచిపోయాయి. రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీల్లో ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది? ఎవరు ఏం చేస్తున్నారు? అనే చర్చ సహజంగానే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే.. అరకు ఎంపీగా తొలి విజయం అందుకుని.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించిన గొట్టేటి మాధవి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమె విద్యావంతురాలు.. గతంలో టీచర్ ఉద్యోగం కూడా చేశారు. అయితే.. రాజకీయంగా ఆమె సాధించింది పెద్దగా లేదని స్థానికులే చెబుతున్నారు.
గట్టి వాయిస్ లేదు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నప్పటికీ.. పార్లమెంటులో బలమైన గళం కూడా వినిపించలేదని చెబుతున్నారు. స్థానికంగా అరకులో 1/70 చట్టంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని తీ సేయాలనేది ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మాట. అదేసమయంలో గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. ఇక, ప్రసూతి వచ్చినా.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా.. నియోజకవర్గం నుంచి విశాఖ వస్తే.. తప్ప మెరుగైన వైద్య అందే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో అరకులోనే మెరుగైన సౌకర్యాలతో వైద్య శాలను ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. అయితే.. ఇవన్నీ.. చేస్తామని.. తనను గెలిపించాలని.. మాధవి హామీ ఇచ్చారు. అయితే.. దీనిని ఆమె మరిచిపోయారు. తన వివాహం పేరుతో ఏడాది పాటు ప్రజలకు దూరంగా ఉన్నారని..ఇక్కడి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత.. కరోనాపేరుతో అసలు కంటికి కూడా కనిపించలేదు. ఇక, ఇటీవల కాలంలో కరోనా తగ్గినా.. వ్యక్తిగత సమస్యలతో ఆమె గడప దాటి బయటకు రావడం లేదు.
ఈ పరిణామాలతో ఎంపీపై ఆశలు సన్నగిల్లుతున్నాయని అంటున్నారు. అయితే.. ఆమెపై వ్యతిరేకత లేకపోయినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదనే వాదన మాత్రంబలంగా వినిపిస్తోంది. వచ్చే రెండేళ్లలో అయినా.. తమకు చేరువగా ఉండాలని… గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఎంపీగారు.. ప్రజల మాట వింటారా.. లేదా.. చూడాలి. ఇక్కడ ఆమెకు కలిసి వస్తున్న అంశం ఏంటంటే.. ప్రతిపక్షం బలంగా లేక పోవడమే!!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార తీరుపై ఇప్పటికే లెక్కలేనన్ని చర్చలు జరిగాయి. అటు సినిమాలు,…
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత…
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…