మూడేళ్లు గడిచిపోయాయి. రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీల్లో ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది? ఎవరు ఏం చేస్తున్నారు? అనే చర్చ సహజంగానే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే.. అరకు ఎంపీగా తొలి విజయం అందుకుని.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించిన గొట్టేటి మాధవి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమె విద్యావంతురాలు.. గతంలో టీచర్ ఉద్యోగం కూడా చేశారు. అయితే.. రాజకీయంగా ఆమె సాధించింది పెద్దగా లేదని స్థానికులే చెబుతున్నారు.
గట్టి వాయిస్ లేదు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నప్పటికీ.. పార్లమెంటులో బలమైన గళం కూడా వినిపించలేదని చెబుతున్నారు. స్థానికంగా అరకులో 1/70 చట్టంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని తీ సేయాలనేది ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మాట. అదేసమయంలో గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. ఇక, ప్రసూతి వచ్చినా.. ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా.. నియోజకవర్గం నుంచి విశాఖ వస్తే.. తప్ప మెరుగైన వైద్య అందే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో అరకులోనే మెరుగైన సౌకర్యాలతో వైద్య శాలను ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. అయితే.. ఇవన్నీ.. చేస్తామని.. తనను గెలిపించాలని.. మాధవి హామీ ఇచ్చారు. అయితే.. దీనిని ఆమె మరిచిపోయారు. తన వివాహం పేరుతో ఏడాది పాటు ప్రజలకు దూరంగా ఉన్నారని..ఇక్కడి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత.. కరోనాపేరుతో అసలు కంటికి కూడా కనిపించలేదు. ఇక, ఇటీవల కాలంలో కరోనా తగ్గినా.. వ్యక్తిగత సమస్యలతో ఆమె గడప దాటి బయటకు రావడం లేదు.
ఈ పరిణామాలతో ఎంపీపై ఆశలు సన్నగిల్లుతున్నాయని అంటున్నారు. అయితే.. ఆమెపై వ్యతిరేకత లేకపోయినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదనే వాదన మాత్రంబలంగా వినిపిస్తోంది. వచ్చే రెండేళ్లలో అయినా.. తమకు చేరువగా ఉండాలని… గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఎంపీగారు.. ప్రజల మాట వింటారా.. లేదా.. చూడాలి. ఇక్కడ ఆమెకు కలిసి వస్తున్న అంశం ఏంటంటే.. ప్రతిపక్షం బలంగా లేక పోవడమే!!
This post was last modified on April 22, 2022 7:42 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…