ఏపీలో రాజకీయ యాత్రలు ప్రారంభం కానున్నాయి. అది కూడా ఒకవైపు.. అధికార పార్టీ వైసీపీ, మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా యాత్రలకు రెడీ అవుతున్నాయి. దీంతో జనాలకు పొలిటికల్ పండుగేనని అంటున్నారు. మే 1వ తారీకు నుంచి అధికారపార్టీ వైసీపీ `ఇంటింటికీ వైసీపీ` పేరుతో యాత్రలు ప్రారం భిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. జూన్ 1 నుంచి టీడీపీ జిల్లాల యాత్రకు రెడీ అవుతున్నారు. వైసీపీ ఇప్పటికే.. జిల్లాలకు బాధ్యులను నియమించింది. అదేసమయంలో వీరిని నడిపించేందుకు ఇంచార్జ్లను నియమించింది. దీంతో వచ్చే నెల 1 నుంచి ఇంటింటికీ వైసీపీ ప్రారంభం కానుంది.
వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధులు కూడా ప్రజల వద్దకు వెళ్లడం.. ప్రభుత్వం చేసిన కార్యక్రమా లు, చేస్తున్న సంక్షేమాన్ని వివరించనున్నారు. దీనికి సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే పార్టీ నాయకులకు దిశానిర్దేశించారు. అంతేకాదు.. ప్రతి ఎమ్మెల్యే కూడా.. తన నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి మూడుసార్లు ప్రజలకు చేరువ అవ్వాలని నిర్దేశించారు. అంతేకాదు.. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు.. ప్రజలను పేరు పెట్టి పిలిచేంత చనువును సంపాదించాలని కూడా చెప్పారు.
మొత్తంగా చూస్తే.. వైసీపీ అధిష్టానం యాత్రలపై తీవ్రస్థాయిలోకసరత్తు చేసింది. రోడ్మ్యాప్ కూడా రెడీ చేసుకుంది. దాని ప్రకారమే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. దీంతో అధికార పార్టీ నాయకులు ఆయా కార్యక్రమాలపై కుస్తీ పడుతున్నారు. మరోవైపు… వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా యాత్రా స్పెషల్కు రంగం రెడీ చేసుకుంది. మేనెలలో నిర్వహించే మహానాడు ముగియగానే.. ప్రజల్లోకి వెళ్లాలని.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు.
వచ్చే ఏడాది కాలంలో జిల్లాల్లో చుట్టేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో రాబోయే ఏడాది కాలం పాటు రాష్ట్రంలో వైసీపీ, టీడీపీల యాత్రా స్పెషల్ జనాలకు రాజకీయ వేడుక చేయనుందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఈ రెండు పార్టీలు.. తాము చెప్పాలనుకున్నది చెప్పేసి.. యాత్రను ముగిస్తాయా? లేక.. ప్రజల సమస్యలను కూడా వినేందుకు ప్రాధాన్యం ఇస్తాయా? అనేది చూడాలి. ఎందుకంటే.. ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ, వారు వీరిలాగా యాత్రలు చేయలేరుకదా!!
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…