Political News

ఇటు టీడీపీ.. అటు వైసీపీ.. పొలిటిక‌ల్ టూర్లు!!

ఏపీలో రాజ‌కీయ యాత్ర‌లు ప్రారంభం కానున్నాయి. అది కూడా ఒక‌వైపు.. అధికార పార్టీ వైసీపీ, మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా యాత్ర‌ల‌కు రెడీ అవుతున్నాయి. దీంతో జ‌నాల‌కు పొలిటికల్ పండుగేనని అంటున్నారు. మే 1వ తారీకు నుంచి అధికారపార్టీ వైసీపీ `ఇంటింటికీ వైసీపీ` పేరుతో యాత్ర‌లు ప్రారం భిస్తోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. జూన్ 1 నుంచి టీడీపీ జిల్లాల‌ యాత్ర‌కు రెడీ అవుతున్నారు.  వైసీపీ ఇప్ప‌టికే.. జిల్లాల‌కు బాధ్యుల‌ను నియ‌మించింది. అదేస‌మ‌యంలో వీరిని న‌డిపించేందుకు ఇంచార్జ్‌లను నియ‌మించింది. దీంతో వ‌చ్చే నెల 1 నుంచి ఇంటింటికీ వైసీపీ  ప్రారంభం కానుంది.

వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం.. ప్ర‌భుత్వం చేసిన కార్య‌క్ర‌మా లు, చేస్తున్న సంక్షేమాన్ని వివ‌రించ‌నున్నారు. దీనికి సంబంధించి సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే పార్టీ నాయ‌కులకు దిశానిర్దేశించారు. అంతేకాదు.. ప్ర‌తి ఎమ్మెల్యే కూడా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మూడుసార్లు ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వాల‌ని నిర్దేశించారు. అంతేకాదు.. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేలు.. ప్ర‌జ‌ల‌ను పేరు పెట్టి పిలిచేంత చ‌నువును సంపాదించాలని కూడా చెప్పారు.

మొత్తంగా చూస్తే.. వైసీపీ అధిష్టానం యాత్ర‌ల‌పై తీవ్ర‌స్థాయిలోక‌స‌ర‌త్తు చేసింది. రోడ్‌మ్యాప్ కూడా రెడీ చేసుకుంది. దాని ప్ర‌కార‌మే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది.  దీంతో అధికార పార్టీ నాయ‌కులు ఆయా  కార్య‌క్ర‌మాల‌పై కుస్తీ ప‌డుతున్నారు. మ‌రోవైపు… వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా యాత్రా స్పెష‌ల్‌కు రంగం రెడీ చేసుకుంది.  మేనెల‌లో నిర్వ‌హించే మ‌హానాడు ముగియ‌గానే.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ వేసుకున్నారు.

వ‌చ్చే ఏడాది కాలంలో జిల్లాల్లో చుట్టేయాల‌ని చంద్ర‌బాబు  నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో రాబోయే ఏడాది కాలం పాటు రాష్ట్రంలో వైసీపీ, టీడీపీల‌ యాత్రా స్పెష‌ల్ జ‌నాల‌కు రాజ‌కీయ వేడుక చేయ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  అయితే.. ఈ రెండు పార్టీలు.. తాము చెప్పాల‌నుకున్న‌ది చెప్పేసి.. యాత్ర‌ను ముగిస్తాయా?  లేక‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కూడా వినేందుకు ప్రాధాన్యం ఇస్తాయా? అనేది చూడాలి. ఎందుకంటే.. ప్ర‌జ‌లు కూడా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ, వారు వీరిలాగా యాత్ర‌లు చేయ‌లేరుక‌దా!! 

This post was last modified on April 22, 2022 11:06 am

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago