Political News

ఇటు టీడీపీ.. అటు వైసీపీ.. పొలిటిక‌ల్ టూర్లు!!

ఏపీలో రాజ‌కీయ యాత్ర‌లు ప్రారంభం కానున్నాయి. అది కూడా ఒక‌వైపు.. అధికార పార్టీ వైసీపీ, మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా యాత్ర‌ల‌కు రెడీ అవుతున్నాయి. దీంతో జ‌నాల‌కు పొలిటికల్ పండుగేనని అంటున్నారు. మే 1వ తారీకు నుంచి అధికారపార్టీ వైసీపీ `ఇంటింటికీ వైసీపీ` పేరుతో యాత్ర‌లు ప్రారం భిస్తోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. జూన్ 1 నుంచి టీడీపీ జిల్లాల‌ యాత్ర‌కు రెడీ అవుతున్నారు.  వైసీపీ ఇప్ప‌టికే.. జిల్లాల‌కు బాధ్యుల‌ను నియ‌మించింది. అదేస‌మ‌యంలో వీరిని న‌డిపించేందుకు ఇంచార్జ్‌లను నియ‌మించింది. దీంతో వ‌చ్చే నెల 1 నుంచి ఇంటింటికీ వైసీపీ  ప్రారంభం కానుంది.

వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌డం.. ప్ర‌భుత్వం చేసిన కార్య‌క్ర‌మా లు, చేస్తున్న సంక్షేమాన్ని వివ‌రించ‌నున్నారు. దీనికి సంబంధించి సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే పార్టీ నాయ‌కులకు దిశానిర్దేశించారు. అంతేకాదు.. ప్ర‌తి ఎమ్మెల్యే కూడా.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మూడుసార్లు ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వాల‌ని నిర్దేశించారు. అంతేకాదు.. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేలు.. ప్ర‌జ‌ల‌ను పేరు పెట్టి పిలిచేంత చ‌నువును సంపాదించాలని కూడా చెప్పారు.

మొత్తంగా చూస్తే.. వైసీపీ అధిష్టానం యాత్ర‌ల‌పై తీవ్ర‌స్థాయిలోక‌స‌ర‌త్తు చేసింది. రోడ్‌మ్యాప్ కూడా రెడీ చేసుకుంది. దాని ప్ర‌కార‌మే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది.  దీంతో అధికార పార్టీ నాయ‌కులు ఆయా  కార్య‌క్ర‌మాల‌పై కుస్తీ ప‌డుతున్నారు. మ‌రోవైపు… వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా యాత్రా స్పెష‌ల్‌కు రంగం రెడీ చేసుకుంది.  మేనెల‌లో నిర్వ‌హించే మ‌హానాడు ముగియ‌గానే.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ వేసుకున్నారు.

వ‌చ్చే ఏడాది కాలంలో జిల్లాల్లో చుట్టేయాల‌ని చంద్ర‌బాబు  నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో రాబోయే ఏడాది కాలం పాటు రాష్ట్రంలో వైసీపీ, టీడీపీల‌ యాత్రా స్పెష‌ల్ జ‌నాల‌కు రాజ‌కీయ వేడుక చేయ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  అయితే.. ఈ రెండు పార్టీలు.. తాము చెప్పాల‌నుకున్న‌ది చెప్పేసి.. యాత్ర‌ను ముగిస్తాయా?  లేక‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కూడా వినేందుకు ప్రాధాన్యం ఇస్తాయా? అనేది చూడాలి. ఎందుకంటే.. ప్ర‌జ‌లు కూడా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ, వారు వీరిలాగా యాత్ర‌లు చేయ‌లేరుక‌దా!! 

This post was last modified on April 22, 2022 11:06 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

34 mins ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

49 mins ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

3 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

3 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

7 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

9 hours ago