Political News

వైసీపీ లేడీ ఎమ్మెల్యే సైలెంట్‌.. అధిష్టానం ఫుల్ క్లారిటీ..!

గుంటూరు జిల్లా వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. మాజీ హోం మంత్రి.. మేక‌తోటి సుచ‌రిత‌.. త‌న‌కు తిరిగి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని.. భావిస్తూ..తీవ్ర‌స్థాయిలో అలిగిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టు… దీనిని ఎంపీ మోపిదేవికి ఇచ్చిన‌ట్టుగా కుమార్తె తో ప్ర‌క‌టన చేయించారు. త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో మొత్తానికే ఎస‌రు త‌ప్ప‌ద‌ని అనుకు న్నారో.. ఏమో.. వెంట‌నే రంగంలోకి దిగి స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాలు చేశారు.

ఇది ఒక‌వైపు.. పార్టీలో ఇంకా ప‌రిస్థితి స‌ర్దు బాటు కాలేద‌నే సంకేతాలు ఇస్తున్నాయి. అంటే.. సుచ‌రిత‌.. ఇప్పట్లో యాక్టివ్ కావ‌డం క‌ష్ట‌మే. మ‌ళ్లీ ఆమె ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు.. ఆరోగ్యం బాగోలేద‌నే స్టోరీనే వినిపించ‌డం ఖాయ‌మ‌ని.. వైసీపీ నేత‌లే అంచ‌నా వేస్తున్నారు. ఇదిలావుంటే… ఇప్పుడు మ‌రో ఎస్సీ నాయ‌కురాలు… వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇంటి డాక్ట‌ర్‌గా పేరున్న తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి కూడా అలిగారు. ఎస్సీ సామాజిక వ‌ర్గంలో మేక‌తోటిని తొల‌గించాక‌.. త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆమె బాగానే ఆశ‌లు పెట్టుకున్నారు.

ముఖ్యంగా.. జ‌గ‌న్ తీస‌కువ‌చ్చిన‌.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని బ‌లంగా స‌మ‌ర్ధించిన‌.. ఉండ‌వ‌ల్లి.. శ్రీదేవి.. అమ‌రావ‌తి విష‌యంలో తీవ్ర విమర్శ‌లే చేశారు. ఇక్క‌డి రైతుల‌తో సై.. అంటే సై అంటూ.. త‌ల ప‌డ్డారు. వారు చేస్తున్న ఉద్య‌మాన్ని.. పెయిడ్‌గా అభివ‌ర్ణించారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ నేత‌లు బ‌య‌ట‌కు రాకుండా.. అనేక సంద‌ర్భాల్లో కేసులు కూడా పెట్టించారు. ఇదంతా కూడా పార్టీలో త‌న పేరు మార్మోగేలా చేసింద‌న‌డంలో సందేహంలేదు.

ఎంత దూకుడుగా ఉంటే అంత మంచిదనే సూత్రాన్ని కొంద‌రు నాయ‌కులు అవ‌లంభించిన‌ట్టుగానే ఉండ‌వ‌ల్లి కూడా అనుస‌రించారు. కానీ,మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భించ‌లేదు. దీంతో ఇప్పుడు ఆమె హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చేశారు. క‌నీసం.. మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారానికి కూడా రాలేదు. ఈ ప‌రిణామాల‌ను గ్ర‌హించిన వైసీపీ అదిష్టానం.. ఆమెకు ప‌రోక్షంగా కొన్నిసంకేతాలు పంపించింది. పార్టీని బ‌లోపేతం చేస్తేనే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇస్తామ‌ని.. చెప్పేసింద‌ట‌. అంతేకాదు.. అల‌క రాజ‌కీయాల‌కు పార్టీ ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్రాధాన‌న్యం ఇచ్చేది లేద‌ని.. తెగేసి చెప్పిన‌ట్టు ఉండ‌వ‌ల్లి వ‌ర్గం చెబుతోంది. దీంతో ఇప్పుడు.. ఆమె డోలాయ‌మానంలో ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

This post was last modified on April 19, 2022 10:06 am

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

1 hour ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

1 hour ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago