Political News

ఏపీ కేబినెట్‌.. కుర్మా కూర్పు!: జ‌గ‌న్‌పై జ‌న‌సేన ఫైర్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ హోంమంత్రి, కాపుసంక్షేమ సేన వ్యవస్ధాపక అధ్యక్షుడు, జ‌న‌సే న కీల‌క‌నాయ‌కుడు చెగోండి హరిరామజోగయ్య తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రాత్రి, పగలు అనకుండా పల్లెలు, పట్టణాలు అని లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు అనధికారికంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దౌర్భాగ్య స్ధితిని ప్రజలు చూడలేదని తెలిపారు. నిరవధిక విద్యుత్ సరఫరా చేయలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అనుభవ రాహిత్యమే అని ఆయన వ్యాఖ్యానిం చారు.

నవరత్నాలు అనేక మందికి అందిస్తున్నామని సీబీఐ దత్తపుత్రుడు జగన్ చెపుతున్నారని యెద్దేవా చేశారు. ఈ పథకాల ద్వారా 10 శాతం మంది ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదన్నారు. తమ జేబులు నింపుకోవడ మే ధ్యేయంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేసే ప్రాజెక్టులు ప్రైవేటు వ్యక్తులకు తక్కవ ధరకు అమ్మడం, పోరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. గోరుచుట్టుపై రోకలి పోటులా విద్యుత్ కోతలకు తోడుగా విద్యుత్ చార్జీల పెంపు ఈ ప్రభుత్వం చేసిందని ఆగ్రహించారు.

ఇలాంటి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దించి జనసేన గ్యారేజ్ దెబ్బ రుచి చూపించాలని హరిరామ జోగయ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ప‌వ‌న్‌.. సీబీఎన్ ద‌త్త‌పుత్రుడ‌ని.. జ‌గ‌న్ ఏమైనా క‌ల‌లు గ‌న్నారా? అని ప్ర‌శ్నించారు. తాము మాత్రం జ‌గ‌న్‌ను సీబీఐ ద‌త్త‌పుత్రుడుగానే ఇక నుంచి చూస్తామ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అని నిల‌దీశారు. తాజా మంత్రి వ‌ర్గ కూర్పుపై మాట్లాడుతూ… ఇదొక కుర్మా కూర్పుగా అభివ‌ర్ణించారు. దీనిలో అన్నీ.. జ‌గ‌నే చూసుకుంటార‌ని.. ఎవ‌రికీ ఎలాంటి అధికారాలూ లేవ‌న్నారు.

మంత్రులు అంద‌రూ మూకుమ్మ‌డిగా.. వ‌రుస పెట్టి సీఎం జ‌గ‌న్‌ కాళ్ల మీద‌ప‌డ‌డాన్ని చూస్తేనే.. ఆయ‌న కూర్పు ఎలా ఉందో అర్ధ‌మ‌వుతోంద‌ని అన్నారు. అంత‌గా కాళ్ల‌మీద ప‌డాల‌ని అనుకుంటే.. ముందే ఆ ప‌నిచేసి.. త‌ర్వాత ప్ర‌మాణం చేయొచ్చుక‌దా? అని ప్ర‌శ్నించారు. బీసీల‌కు సంక్షేమం అమ‌లు చేయ‌కుండా.. ఎన్ని ప‌ద‌వులు ఇచ్చినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓట‌మి ఖాయ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

This post was last modified on April 15, 2022 5:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

2 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

3 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

3 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

3 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

4 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

5 hours ago