Political News

జ‌గ‌న్ కేబినెట్ 2.0పై గంటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సీఎం జగన్ కొత్త కెబినేట్ 2.0పై టీడీపీ నేత, మాజీ మంత్రి, విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే(రాజీనామా చేసినప్ప‌టికీ.. ఇంకా ఆమోదం పొంద‌లేదు) గంటా శ్రీనివాసరావు స్పందించారు. వైసీపీ వర్గీయులే నిరసనలకు దిగేలా జగన్ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగిందని విమర్శంచారు. మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలకు న్యాయమైన హేతుబద్ధత కొరవడిందన్నారు. “ఇదేం మంత్రి వ‌ర్గం.. ఇదే కేబినెట్‌. ఇదంతా భ‌జ‌న ప‌రుల క్యాబినెట్‌. ఇదా సామాజిక స‌మ‌తుల్యం. ఇది మోసం చేయ‌డ‌మే. కేబినెట్ హ‌డావుడితో విలువైన వారంరోజుల స‌మ‌యాన్ని సుమారు కోటి రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని వృథా చేశారు” అని గంటా వ్యాఖ్యానించారు.

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలకు న్యాయమైన హేతుబద్ధత లేదని గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ పార్టీలో ఉన్న కీల‌క నేత‌లు, పార్టీ అనుచ‌రులు, మాజీ మంత్రుల వర్గీయులే నిరసనలకు దిగేలా జగన్ మంత్రివర్గ విస్తరణ జరిగిందని విమర్శంచారు. విశాఖను రాజధాని అని చెప్తున్న ప్రభుత్వం.. నగరానికి కనీసం మంత్రిని లేకుండా చేశారని దుయ్యబట్టారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని.. కానీ వారికి మేలు చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీనే అని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

జిల్లా విభజన కూడా సరిగా జరగలేదన్నారు. జిల్లా విభజన సమయంలో సీఎం తీరుతో సొంతపార్టీ నాయకులే చెప్పులతో కొట్టుకున్నారని గుర్తు చేశారు. కొత్త కెబినేట్ ఏర్పాటుతో వైసీపీలోను విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు జగన్ తనని తాను బలమైన నాయకుడిగా చూపించుకున్నారని.. కానీ తాజా పరిస్థితులతో బలహీనమైన నాయకుడని నిరూపణ అయిందన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు లేద‌న్నారు. ప్ర‌జ‌లు కూడా ఆయ‌న పాల‌న‌తో విసిగిపోయార‌ని చెప్పారు.

“ధ‌ర‌లు పెంచ‌న‌ని ఆయ‌నే చెప్పారు. ఇప్పుడు ధ‌ర‌లు పెంచారు. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కావాల‌ని.. ఆయ‌నే అన్నారు. 33 వేల ఎక‌రాల భూమి కావాల‌న్నారు. ఇప్పుడు అదే రాజ‌ధానిని ముంచేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను దేవుళ్ల‌లా చూస్తాన‌ని చెప్పారు. రైతుల‌కు రాజన్య రాజ్యం చేరువ చేస్తాన‌ని అన్నారు.కానీ, ఇవేవీ.. సాకారం కావ‌డం లేదు. నియంత మాదిరిగా పాలిస్తున్నారు. ఇలాంటి.. పాలన కోస‌మేనా. ఒక్క ఛాన్స్ అని రోడ్లు ప‌ట్టుకు తిరిగారు?” అని గంటా ప్ర‌శ్నించారు. మ‌రి దీనిపై విశాఖ వైసీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ముఖ్యంగా మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.

This post was last modified on April 14, 2022 10:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago