Political News

క్రెడిట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ ఆరాటం

తమ వల్లే యాసంగి ధాన్యం కొనుగోలుకు కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించినట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నాయి. ధాన్యం కొనుగోలు ఎవరు చేయాలనే విషయమై గడచిన ఆరు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్రంపై యుద్ధమన్నారు, భూకంపం సృష్టిస్తానని కేసీయార్ భీకరమైన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. కేసీయార్ ఎంత గోల చేసినా కేంద్రం దిగి రాకపోవడంతో వేరే దారిలేక బాయిల్డ్ రైస్ ను కొనాలని కేసీయార్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. మరో రెండు నెలల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. బాయిల్డ్ రైస్ వాడకం ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయింది కాబట్టి కొనుగోలు చేయలేమని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది.

కేంద్రం ప్రకటించినా సరే తెలంగాణాలో మాత్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందే అని కేసీయార్ పెద్ద రచ్చచేశారు. అయినా ఉపయోగం లేకపోవటంతో వేరే దారి లేక తమ ప్రభుత్వంతోనే కొనిపించాలని నిర్ణయించారు. ఇదే విషయంలో ధాన్యం కొనుగోలుకు కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించటం తమ ఒత్తిడి వల్లే అంటు ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ క్రెడిట్ క్లైం చేసుకుంటున్నాయి. కేసీయార్ ప్రభుత్వంపై తాము పెట్టిన ఒత్తిళ్ళ వల్లే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెబుతున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాము నిర్వహించిన ఆందోళనల కారణంగానే ప్రభుత్వం దిగొచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం రాష్ట్రంలో జరిగిన ఆందోళనలతో కేంద్రం వైఖరి బయటపడిందన్నారు. చివరకు ఈ క్రెడిట్ క్లైం ఏ స్థాయికి చేరుకుందంటే ఉనికిలో ఉందో లేదో తెలీని పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తమ ఒత్తిళ్ల కారణంగానే రైతుల నుంచి ధాన్యం కొనేందుకు కేసీయార్ నిర్ణయించినట్లు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

This post was last modified on April 14, 2022 10:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

32 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago