Political News

గాలి పీల్చినా.. జే ట్యాక్స్ క‌ట్టాలా.? లోకేష్ ఫైర్‌

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర‌స్తాయిలో మండిప‌డ్డారు. జగన్ ప్రభుత్వం పెంచిన పన్నులపై విమ‌ర్శ‌లు గుప్పించారు. పన్నులను భారీగా పెంచి.. సామాన్యులపై మోయలేని భారాన్ని వేస్తున్నారని ఆరోపించారు. పన్నుల పెంపును తీవ్రంగా ఖండించారు.

సీఎం జగన్‌ మాటలు వింటుంటే గాలి పీల్చినా… వదిలినా పన్ను వేసేలా ఉన్నారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘కాదేది బాదుడే బాదుడుకు అనర్హం’ అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. సామాన్యుడిపై పన్నుల పెంపు భారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మూడేళ్లలో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు.

“జ‌గ‌న్ గారి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం.”

“సామాన్యుడిపై పెనుభారాన్ని మోపేలా పల్లె వెలుగు నుండి ఏసీ బస్సు వరకూ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణం.”

“ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు కొట్టేసే విధానాలకు జగన్ రెడ్డి ఇకనైనా స్వస్తి పలకాలి.” అని లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

మ‌రోవైపు.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆయన ప్రతి ఇంటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ కోతలు, ఛార్జీల మోతలపై ఆరా తీశారు. ఇష్టానుసారం విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఉమకు వివరించారు. మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని ప్రభుత్వం అధోగతి పాలు చేసిందంటూ ఆయన విమర్శించారు.

ఇక‌, నిత్యావసర వస్తువుల నుంచి అన్నింటి ధరలు పెంచుతూ.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారని నెల్లూరు నగర టీడీపీ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ.. బాదుడే బాదుడు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్తు ఛార్జీల్ని పెంచడమే కాకుండా కరెంటు కోతలతో నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీల్లో తిరుగుతూ విసనకర్రలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. నెల్లూరుకి మాజీ మంత్రి అనిల్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.

This post was last modified on April 13, 2022 2:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

1 hour ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago