Political News

గాలి పీల్చినా.. జే ట్యాక్స్ క‌ట్టాలా.? లోకేష్ ఫైర్‌

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర‌స్తాయిలో మండిప‌డ్డారు. జగన్ ప్రభుత్వం పెంచిన పన్నులపై విమ‌ర్శ‌లు గుప్పించారు. పన్నులను భారీగా పెంచి.. సామాన్యులపై మోయలేని భారాన్ని వేస్తున్నారని ఆరోపించారు. పన్నుల పెంపును తీవ్రంగా ఖండించారు.

సీఎం జగన్‌ మాటలు వింటుంటే గాలి పీల్చినా… వదిలినా పన్ను వేసేలా ఉన్నారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘కాదేది బాదుడే బాదుడుకు అనర్హం’ అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. సామాన్యుడిపై పన్నుల పెంపు భారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మూడేళ్లలో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు.

“జ‌గ‌న్ గారి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం.”

“సామాన్యుడిపై పెనుభారాన్ని మోపేలా పల్లె వెలుగు నుండి ఏసీ బస్సు వరకూ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణం.”

“ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు కొట్టేసే విధానాలకు జగన్ రెడ్డి ఇకనైనా స్వస్తి పలకాలి.” అని లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

మ‌రోవైపు.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆయన ప్రతి ఇంటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ కోతలు, ఛార్జీల మోతలపై ఆరా తీశారు. ఇష్టానుసారం విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఉమకు వివరించారు. మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని ప్రభుత్వం అధోగతి పాలు చేసిందంటూ ఆయన విమర్శించారు.

ఇక‌, నిత్యావసర వస్తువుల నుంచి అన్నింటి ధరలు పెంచుతూ.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారని నెల్లూరు నగర టీడీపీ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ.. బాదుడే బాదుడు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్తు ఛార్జీల్ని పెంచడమే కాకుండా కరెంటు కోతలతో నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీల్లో తిరుగుతూ విసనకర్రలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. నెల్లూరుకి మాజీ మంత్రి అనిల్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.

This post was last modified on April 13, 2022 2:56 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

1 hour ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

2 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

4 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

5 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

5 hours ago

తాడిప‌త్రిలో ఉండొద్దు.. జేసీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన పోలీసులు

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రిలో ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర హింస చెల‌రేగింది. ఇక్క‌డ పోటీలో ఉన్న జేసీ…

11 hours ago