పాత నీరు పోతుంది అని అనుకోకండి..కొత్త నీరు వస్తుంది అని సంబరపడిపోవద్దు. రెండింటి మేలు కలయికే కొత్త క్యాబినెట్ అని అంటున్నారు జగన్ 2.0 ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి. ఆయన చెబుతున్న ప్రకారం పాత కొత్తలు కలుస్తారు. కలిసి పనిచేస్తారు. ఇంకొందరు సీనియర్లు జిల్లాలకు పోయి పార్టీ పనులు పర్యవేక్షిస్తారు. ఆ విధంగా పార్టీనీ, ప్రభుత్వాన్నీ ఏక కాలంలో ప్రక్షాళన చేశామన్న భావన ఒకటి ఇవాళ సీఎం జగన్ లో స్థిరపడనుంది. అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులూ వాటితో కూడిన కూర్పులు చేస్తున్నారు.
ఆదివారం సాయంత్రంకు ఒక నిర్ణయం వస్తుంది.
అటుపై సీఎం స్వయంగా కాల్ చేసి కొత్త మంత్రులకు శుభాకాంక్షలు చెప్పి బాగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ నాలుగు మంచి మాటలు చెప్పనున్నారు. కాల్ రాకపోతే పోస్టు లేనట్లే! ఇది ఫిక్స్ భయ్యా! ఇక గత మంత్రి వర్గం నుంచి వివాదాలు ఎదుర్కొన్న బూతుల మంత్రి కొడాలి నాని మళ్లీ వస్తున్నాడు. ఇప్పుడిదే భయం తెలుగుదేశం పార్టీకి పట్టుకుంది. గతం కన్నా వేగంగా పనిచేసి టీడీపీని తాను నిలువరిస్తానని ఇప్పటికే చెప్పారాయన అని తెలుస్తోంది.
పదవి ఉంటేనే తనకు అడ్డు అని లేదంటే విశ్వరూపం చూపిస్తానని మొన్న కూడా అన్నారు. అంటే అన్నారు కానీ పౌర సరఫరాలే మళ్లీ ఆయనకు ఇస్తారా? ఇస్తే బియ్యం లెక్కలు మళ్లీ ఏమౌతాయో ! అన్న భయం ఒకటి వినిపిస్తుంది. ఏదేమయినప్పటికీ మంత్రులు ఎవ్వరయినా అధికారవం జగన్ దే. కానీ కాకినాడ కేంద్రంగా ఓడరేవు దాటిపోతున్న బియ్యం లెక్క మాత్రం గౌరవ ముఖ్యమంత్రి తేల్చలేకపోతున్నారు. నాటు సారా ప్రవాహాలను నిలువరించలేకపోతున్నారు. గంజాయి రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. అధికారం అంతా ఆయనదే కదా మరి నేనుండి ఏం చేయాలి అని గతంలో బొత్స అరిచాడు.
కానీ ఆ అరుపును పట్టించుకోలేదు. ఆ ముగ్గురు రెడ్లదేనా రాజ్యం అని కూడా అరిచాడు అయినా పట్టించుకోలేదు. కనుక కొత్తవారు వచ్చినా, పాత వారు కొనసాగినా జగన్ క్యాబినెట్ లో చేయడానికి పనేం ఉండదు. హాయిగా నాలుగు శంకుస్థాపనలు
3 ప్రారంభోత్సవాలతో కాలం నెట్టుకు రావడమే. ఏ ఫైల్ కూడా సొంతంగా తయారు చేయడానికి కానీ ఏ పని కూడా సొంత నిర్ణయంతో చేయడానికి కానీ వీల్లేని స్థితిలో ఇప్పటిదాకా పనిచేసిన మంత్రులు ఉన్నారు. ఇకపై కూడా ఇదే సీన్. కనుక బొత్స కు మళ్లీ తలనొప్పులు తప్పవు.
This post was last modified on April 10, 2022 2:52 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…