పదవులు పోతే ఏమౌతుంది పరాజితులుగా పేరుండిపోతుంది. అసలు ఇలాంటి ఈక్వేషన్లే తప్పు. చెరో రెండున్నర ఏళ్ల చొప్పున మంత్రి పదవి పంచుకోవాలి అని చెప్పడమే తప్పు. గతంలో ఇలాంటి రూల్ మేయర్ ఎన్నికల సమయంలో ఉండేది. మున్సిపల్ చైర్మన్ ను కానీ చైర్ పర్సన్ కానీ ఎన్నుకునే సమయంలో ఉండేది. ఇప్పుడు ఈ రూల్ ను అప్లై చేసి ఎక్కువ మందికి పదవులు ఇవ్వాలని ఆ విధంగా అసంతృప్త వాదాన్ని నిలువరించాలని సీఎం భావిస్తున్నారు.
కానీ సీనియర్లు అంతా ఒకప్పుడు జగన్ వెంట నడిచి నడిచి ఇబ్బందులు పడ్డవారే ! ప్రత్యర్థుల కారణంగా అవమానాలు భరించిన వారే ! కనుక ఇప్పుడు ఆ పద్ధతి మళ్లీ మొదటికి వచ్చే ఛాన్స్ ఉంది. మంత్రి పదవి పోతే జిల్లాలలో హేళన ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. విపక్షాలు తాజా మాజీలపై మరింతగా దాడి చేసే ఛాన్స్ ఉంది. అందుకే మంత్రి పదవి తీసేసినా క్యాబినెట్ ర్యాంకును కొనసాగించేలా, వివిధ కీలక పదవులకు (పార్టీకి సంబంధించి) ఎంపికచేసిన నాయకులకు సంబంధిత గౌరవాన్ని వర్తింపజేసేలా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక క్యాబినెట్ మినిస్టర్ వేరు క్యాబినెట్ ర్యాంకు ఉన్న హోదా వేరు అంటూ చాలా మంది ఇప్పటికే బాహాటంగానే కామెంట్లు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కొందరు ఏం చేసైనా మంత్రి పదవులు నిలుపుకుని తీరాలన్న పతంలో ఉన్నారు. అంతేకాదు కర్ణాటకకు చెందిన మినిస్టర్లతో మాజీ మినిస్టర్లతో కూడా లాబీయింగ్ నడుపుతున్నారు. ఏదీ కుదరకపోతే పార్టీకి రాజీనామా చేసి విపక్ష సభ్యులుగా కొనసాగేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు టీడీపీ నుంచి కొంతమంది వైసీపీ నాయకులకు ఆహ్వానాలు అందుతున్నాయి.
ఈ సారి కనుక మంత్రి పదవి రాకుంటే పార్టీ మారిపోవడం బెటర్ అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో స్థానికంగా తాము నెగ్గుకు రాలేకపోతున్నామని పలువురు అంతర్మథనం చెందుతున్నారు. అందుకే ఎలా అయినా పదవే ధ్యేయంగా రామకృష్ణా రెడ్డి దగ్గర మంతనాలు జరుపుతున్నారు. అప్పటికీ నెగ్గుకు రాలేకపోతే తిరుగుబాటుకు కూడా తాము సిద్ధమేనని తేల్చేశారు చాలా మంది. గతంలో బొత్స, కన్నబాబు లాంటి లీడర్లు జగన్ ను తిట్టిన వారే కనుక పాత కోపాలు మళ్లీ మళ్లీ వ్యక్తీకరించే ఛాన్స్ ఉంది.
This post was last modified on April 9, 2022 6:08 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…