Political News

వైసీపీ హ‌యాంలో ఇలా కూడా చేస్తారా?

ఏపీలో వైసీపీ పాల‌న ప్రారంభించిన త‌ర్వాత‌.. దేవాల‌యాల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని.. విగ్ర‌హాల‌ను ధ్వంసం చేయ‌డం.. ఆల‌యాల కూల్చివేత‌లు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయాయ‌ని.. రాష్ట్ర బీజేపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థంలో ఏకంగా.. రాముడి శిర‌చ్ఛేద‌న రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని సైతం ఉలిక్కి ప‌డేలా చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నిందుతులు ఎవ‌రో.. ప‌ట్టుకోలేక పోవ‌డం.. ఏపీ స‌ర్కారుకే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు సామాన్యుల నుంచి కూడా వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు.. రాష్ట్రంలో బ‌ల‌వంత‌పు.. సానుకూల మ‌త‌మార్పిడులు జ‌రుగుతున్నాయ‌ని.. రాష్ట్ర బీజేపీ నేత‌లు నెత్తీనోరూ.. మొత్తుకుంటున్నారు. దీనిపై ఇటీవ‌ల‌కేంద్రం కూడా క‌న్నెర్ర చేసి.. రాష్ట్ర అధికారుల‌కు తాఖీదులు పంపించింది. ఇదిలావుంటే.. ఆలయాల‌పై దాడుల‌ను మించిన ఘోరం చోటు చేసుకుంది. అది కూడా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఉంటున్న తాడేప‌ల్లి నుంచి 5 లేదా 6 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న ప్ర‌ముఖ శైవ క్షేత్రం.. పెద్ద‌కాకాని మ‌ల్లేశ్వ‌రస్వామి ఆల‌యంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఇప్పుడు.. స్థానికంగానే కాదు.. రాష్ట్రంలో పెను కుదుపున‌కు దారితీసింది.

 పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయం క్యాంటిన్‌లో మాంసాహారం వండటం కలకలం రేపింది. అన్నదానానికి భోజనం సరఫరా చేసే క్యాంటిన్‌లో(ఇది ఆల‌యం ప‌రిధిలోనే ఉంది) కోడి మాంసం వండటం విమర్శలకు తావిచ్చింది. క్యాంటీన్ అధికార పార్టీకి చెందిన నాయకుడిది కావడంతో ఎవరూ నోరు మెదపడం లేదని చెబుతున్నారు. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడి క్యాంటిన్‌లో అల్పాహారం తయారు చేస్తుంటారు. అన్నదానానికి కూడా ఇక్కడి నుంచి భోజనం సరఫరా చేస్తారు. ఇప్పుడు అదే క్యాంటిన్‌లో కోడి మాంసం వండటం దారుణంగా మారింది.

క్యాంటిన్‌ నిర్వహణను ఓ ప్రైవేటు వ్యక్తి వేలంపాటలో దక్కించుకున్నాడు. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ నేతకు క్యాటరింగ్‌ వ్యాపారం కూడా ఉంది. తనకు వచ్చిన ఆర్డర్లను ఇక్కడే వండి సరఫరా చేస్తుంటాడు. ఇదే క్రమంలో గురువారం ఆలయం ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్‌లోనే మాంసాహారం తయారు చేయించి బయటకు పంపించారు. భక్తుల్లో ఒకరు ఇది గమనించి ఫొటోలు తీశారు. విషయం ఆలయ అధికారుల దృష్టికి వచ్చినా వారు నోరు మెదపడం లేదు.

క్యాంటిన్‌ నిర్వాహకులను పిలిచి వివరణ అడిగినట్టు సమాచారం. అయితే, మాంసాహారం బయటే వండానని, ఆర్డర్‌ ఇచ్చే వారికి అందజేసే క్రమంలో మాంసాహారం ఉన్న రిక్షా లోపలికి వచ్చిందని అధికారులకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలయ వర్గాలతో పాటు స్థానికులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, అధికార పార్టీ నేత కావడం వల్ల నోరు మెదిపేందుకు జంకుతున్నారు.దీనిపై బీజేపీ, టీడీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on April 9, 2022 1:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago