Political News

ఏపీ విభ‌జ‌న‌పై సుప్రీం కోర్టులో కేసు

ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న అంశంపై.. కొన్నేళ్లుగా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న ప్ర‌ముఖుల్లో మాజీ ఎంపీ ఉండవ‌ల్లి అరుణ్‌కుమార్ ఒక‌రు. త‌ర‌చుగా ఆయ‌న ఈ విష‌యాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్ప‌ట్లో ఇలా జ‌రిగింది.. త‌లుపులు మూసేశారు.. మిరియాల కారం క‌ళ్ల‌లో కొట్టారు.. చీక‌ట్లో విభ‌జ‌న చేశారు. ఎవ‌రినీ మాట్లాడనివ్వ‌లేదు.. ఇది పూర్తిగా అశాస్త్రీయం.. అంటూ.. కొన్నాల్లుగా ఉండ‌వ‌ల్లి మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌స్తావిస్తున్నారు. దీనిపై ఆధారాలు.. వివ‌ర‌ణ‌లు.. పార్ల‌మెంటులో జ‌రిగిన చ‌ర్చ వంటివికూడా ఆయ‌న బ‌య‌ట‌కు చెబుతున్నారు.

గ‌తంలో చంద్ర‌బాబు సీఎం గా ఉన్న‌ప్పుడు కూడా తాను ఈ వివ‌రాలు ఇచ్చాన‌ని,, ఆయ‌న చ‌ర్య‌లు తీసుకుని.. పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టేలా చేస్తాన‌ని చెప్పిన‌ట్టు ఉండ‌వ‌ల్లి వివ‌రించారు. ఈలోగా.. చంద్రబాబు ప్ర‌భుత్వం ప‌డిపోయింద‌ని.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌కు కూడా ఆయ‌న విన్న‌పాలు చేశారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌.. ఎక్క‌డా స్పందించ‌లేద‌ని ఇటీవ‌ల ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సాక్షాత్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే.. పార్ల‌మెంటులో ఏపీ విభ‌జ‌న‌పై వ్యాఖ్య‌లు చేశార‌ని, అసంబ‌ద్ధంగా జ‌రిగింద‌ని ఆయ‌నేచెప్పార‌ని.. కాబ‌ట్టి మ‌నం గ‌ట్టిగా నిల‌దీయొచ్చ‌ని ఆయ‌న కోరారు.

అయితే. జ‌గ‌న్ స‌ర్కారు ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టింది. కానీ, ఇంత‌లోనే రాష్ట్రాల విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై ఉండవల్లి అరుణ్ కుమార్.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ విభజన విషయంలో తప్పులు జరిగాయని.. నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. విభజన ప్రక్రియ సరైంది కాదని కోర్టును ఆశ్రయించారు. ప్రక్రియ పూర్తయినందున భవిష్యత్‌లో జాగ్రతలు తీసుకోవాలని ఉండవల్లి సవరణ పిటిషన్ వేయగా.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్ను.. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తా వించారు. పిటిషన్ దాఖలు చేసి చాలా కాలం అయిందని, ఏపీ విభజనపై ఇటీవల ప్రధాని వ్యాఖ్యలను.. సైతం ఆయన కోర్టులో ప్రస్తావించారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు అంగీకరించిన సీజేఐ.. త్వరితగతిన విచారణకు అంగీకారం తెలిపారు. వచ్చే వారంలో లిస్ట్‌లో పొందుపరిచేలా చూడాలని.. సీజేఐ రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో దీనిపై విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. అయితే. ఈ క్ర‌మంలో ఇటు ఏపీ ప్ర‌భుత్వానికి, అటు తెలంగాణ ప్ర‌భుత్వానికి కూడా నోటీసులు వ‌స్తే.. వీరు సుప్రీం కోర్టుకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

This post was last modified on April 8, 2022 7:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

2 hours ago

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

5 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

5 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

5 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

6 hours ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

8 hours ago