Political News

కాళేశ్వ‌రం కోసం భూమి ఇవ్వాల్సిందే.. లేదంటే చచ్చిపోతా: అధికారి

“కాళేశ్వ‌రం కోసం నీ భూమి ఇవ్వాల్సిందే. నాపైనా.. తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయి. నువ్వు భూమి ఇవ్వనని అంటే.. నువ్వు కాదు.. నేనే పురుగు మందు తాగుతా. చ‌చ్చిపోతా. నా కుటుంబం అనాధై పోతుంది.“ ఇదీ.. తెలం గాణలోని రైతుకు ఆర్డీవో చేసిన హెచ్చ‌రిక‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయింది.  ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాలువ భూసేకరణ సర్వే కోసం ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ‌కు దిగింది. సీఎం కేసీఆర్ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌ర్వే చేయాల‌ని ఆదేశం జారీచేయ‌డంతో అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. ఈ క్ర‌మంలో రైతుల‌ను అదిలించో బెదిరించో.. భూములు తీసుకోవాల‌ని చూస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో తాజాగా అధికారులను రైతులు అడ్డుకున్నారు. తాము భూములు ఇచ్చేది లేద‌ని.. తాము న‌మ్ముకున్న భూమిని ఇవ్వ‌బోమ‌ని.. లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తే.. పురుగుల మందు తాగుతామని ఓ రైతు కుటుంబం హెచ్చ‌రించింది.

దీంతో ఓ అధికారి వెంట‌నే స్పందిస్తూ.. మాపై తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయి. భూసేకరణ చేయకుంటే తనదీ పురుగుల మందు తాగాల్సిన పరిస్థితేనంటూ.. ఆ అధికారి వ్యాఖ్యానించడం  తీవ్ర చర్చనీయాంశం గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలంలో అదనపు టీఎంసీ కాలువ భూసేకరణ సర్వేలో జాప్యంపై ఆర్డీవో శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలాసాగర్లో భూసేకరణ సర్వే కోసం వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.

విషయం తెలుసుకున్న ఆర్డీవో విలాసాగర్ చేరుకొని అధికారులతో సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న రైతులు తమ అనుమతి లేనిది వ్యవసాయ పొలాల్లోకి రావొద్దని సూచించారు. గ్రామ సభ నిర్వహించి పరిహరంపై స్పష్టత ఇవ్వాలన్నారు. పురుగుల మందు డబ్బాలతో ఆందోళన నిర్వహించారు. పురుగుల మందు తాగుతామని రైతులు పేర్కొనడంతో తాను ప్రభుత్వ ఉద్యోగినని చట్టపరిధిలో పనిచేయాల్సి ఉంటుందని, త‌న‌పైనా బోలెడు మంది ఒత్తిడి తెస్తున్నార‌ని.. ఆర్డీవో చెప్పాడు.

అంతేకాదు..  తనకు పురుగుల మందు ఇవ్వాలని తాగుతానని, ఇక్క‌డే చ‌చ్చిపోతాన‌ని ఆర్డీవో శ్రీనివాస్‌ పేర్కొన్నారు. భూ సేకరణ చేయకుంటే తమదీ అదే పరిస్థితంటూ… రైతులకు ఆర్డీవో వివరణ ఇచ్చారు. చట్టప్రకారం భూసేకరణ జరుగుతుందని రైతులు సహకరించాలన్నారు. భూసేకరణపై గతంలో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. తాను చెప్పిన విధంగా ఎందుకు సర్వే చేయడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. రైతులకు వివరంగా చెప్పి సర్వే చేయాలని ఆదేశించారు. అయితే.. ఆర్డీవో చేసిన వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాలు మండి ప‌డుతున్నాయి. సీఎం కేసీఆర్ నియంత పాల‌న‌లో అధికారులు కూడా ప‌నిచేయ‌లేక పోతున్నార‌ని.. కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కులు దుయ్య‌బ‌డుతున్నారు.

Satya

Recent Posts

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

2 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

2 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

4 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

4 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

5 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

5 hours ago