Political News

ప‌సుపు ద‌ళంలో పండు వెన్నెల‌..

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆవిర్భ‌వించి రేప‌టికి(మంగ‌ళ‌వారం) 40 వ‌సంతాలు నిండుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అంగ‌రంగ వైభ‌వంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు.. ప‌సుపుద‌ళం సిద్ధ‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. జాతీయ‌స్థాయిలోనూ.. పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా అమెరికా.. బ్రిట‌న్‌, దుబాయ్ దేశాల్లోనూ.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. పసుపు పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

అదేస‌మ‌యం జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని.. చంద్ర‌బాబు ఇప్ప‌టికే పిలుపు నిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాల‌ను.. మే.. 29 వ‌తేదీ వ‌ర‌కు అంటే.. మ‌హానాడు నిర్వ‌హించే వ‌ర‌కు.. చేయాల‌ని.. తొలుత నిర్ణ‌యించారు. మండ‌ల‌, గ్రామ స్థాయిలో పార్టీని మ‌రింత పుంజుకునేలా చేయాల‌ని.. పార్టీ ఆవిర్భా వ ల‌క్ష్యాల‌ను.. పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సేవ‌ను.. అనేక మంది నాయ‌కుల‌ను తీర్చిదిద్దిన క్ర‌మాన్ని కూడా ప్ర‌జ‌లకు వివ‌రించ‌నున్నారు.

ఈ క్ర‌మంలో పార్టీ కేంద్ర కార్యాల‌యంలో చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం ఉద‌యం ఆవిర్భావ వేడుక‌ల‌ను ప్రారంభించిన అనంత‌రం.. మండ‌ల స్థాయిలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా.. పార్టీ ప్ర‌గ‌తిని.. జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వివ‌రిస్తారు. అదేవిధంగా య‌న‌మ ల రామ‌కృష్ణుడు… బుచ్చ‌య్య చౌద‌రి ప‌లు తీర్మానాల‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి నంద మూరి కుటుంబం మొత్తం హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఎన్టీఆర్ జ‌న్మ‌స్థ‌ల‌మైన‌.. కృష్నాజి ల్లా నిమ్మ‌కూరులో పార్టీఆవిర్భావ వేడుక‌ను పండుగ‌లా నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష‌మందికి అన్న‌దానం, వ‌స్త్ర దానం చేయాల‌ని.. పార్టీ నాయ‌కులు నిర్ణ‌యించారు. ఇక‌, అంత‌ర్జాతీయ‌స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఎన్ ఆర్ ఐ ప‌సుపు ద‌ళం.. పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌ను.. ఘ‌నంగా నిర్వ‌హించేందుకు.. ఏర్పాటు చేశారు. 

Satya

Recent Posts

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

19 minutes ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

3 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

3 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

3 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

4 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

4 hours ago