Political News

కాపులపై బీజేపీ కన్ను పడిందా?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కాపుల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లా అహోబిలంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలకు చెందిన బలిజల సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో కాపులని, రాయలసీమ జిల్లాల్లో బలిజలని అంటారు. కొద్దిరోజులుగా కాపుల ఓట్లన్నింటినీ బీజేపీ వైపు మళ్లించేందుకు కమలనాథులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

కాపు సామాజిక వర్గం నేతలు కానీ ఓటర్లు కానీ ఒక పార్టీతో ఎప్పుడూ లేరు. తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తమకు ఇచ్చే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కాపు నేతలు వివిధ పార్టీల్లో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఎవరే పార్టీల్లో కంటిన్యూ అవుతుంది అది కాంగ్రెస్-టీడీపీ మధ్య మాత్రమే జరుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీ-టీడీపీ గా మారింది. కాపులకు రాజ్యాధికారం అని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఐకమత్యం లేని కారణంగా సాధ్యం కావడం లేదు.

కాపు నేతల్లో చాలామంది ఇటు వైసీపీ అటు టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఇపుడు మూడో పార్టీగా బీజేపీ ఎంటరవుతోంది. అందుకనే వ్యూహాత్మకంగా కాపు నేత అయిన సోము వీర్రాజును అధ్యక్షుడిని చేసింది. ఇంతకు ముందున్న కన్నా లక్ష్మీనారాయణ కూడా కాపే అయినప్పటికి కాపులను బీజేపీ వైపు తీసుకురావటంలో ఫెయిలయ్యారు. ఇంకో పాయింట్ ఏమిటంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం కూడా కాపుల ఓట్ల కోసమే.

ఇపుడు కాపులకు 5 శాతం రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ పదే పదే ప్రస్తావిస్తున్న కారణం కూడా ఇదే. కాపులను గనుక ఆకర్షించగలిగితే ఓట్లతో పాటు సీట్లను కూడా సంపాదించుకోవచ్చన్నది బీజేపీ నేతల వ్యూహం. అయితే ఇందులో కమలనాథులు ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలీదు. ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మరోవైపు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేస్తోంది. ఇంకోవైపు కాపులను తమకు మద్దతుగా నిలబడేట్లు రిజర్వేషన్ పేరుతో  దువ్వుతోంది. కాబట్టి బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాల్సిందే.

This post was last modified on March 28, 2022 10:48 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

13 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

14 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

14 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

15 hours ago

జగన్‌ సీట్లపై పీకే లేటెస్ట్ అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…

16 hours ago

ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్‌

దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…

17 hours ago