Political News

సరిహద్దుల్లో వాయుసేన భారీ మొహరింపు వ్యూహం ఏమిటి?

ఆచితూచి అడుగులు వేసే రోజులు పోయాయి. విషయం ఏదైనా తేల్చుకోవాలన్నప్పుడు అమీతుమీ అన్నట్లుగా దూకుడుగా.. దుందుడుకుగా వ్యవహరించినోళ్లదే ఇప్పుడు హవా నడిపిస్తున్నారు. దేశంలో కావొచ్చు.. ప్రపంచంలోని మరే ప్రాంతంలోనైనా కావొచ్చు. అందుకే.. ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి. సమీకరణాలు కొత్తగా సమీకరించుకోవాల్సిన పరిస్థితి. ప్రత్యర్థి ఎవరన్న దాని కంటే.. ఎలా బదులిస్తామన్న విషయాన్ని చాటి చెప్పే సరికొత్త రణనీతిని ప్రదర్శిస్తోంది మోడీ సర్కారు.

గడిచిన నాలుగైదు దశాబ్దాల్లో ఇప్పటి మాదిరి చైనాతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నది లేదు. దాయాది పాక్ తో రచ్చే కానీ.. ఎంతకైనా సై అన్నట్లు సంకేతాలు చైనాకు పంపటం మాత్రం ఇదే తొలిసారి.

ఎందుకిలా? అన్నది అసలు ప్రశ్న. గల్వామాలో చైనా దురాగతంపై యావత్ దేశం రగిలిపోతోంది. ఎన్నాళ్లీ బెదిరింపులు..? ఏమైతే అదే చూసుకుందామన్నట్లుగా చాలామంది నోట వినిపిస్తున్న మాటకు తగ్గట్లే.. వారి ఆశలకు.. ఆకాంక్షలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మోడీ సర్కారు స్పందన ఉంటుందన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి మోడీకి కానీ.. మోడీ సర్కారుకు కానీ కావాల్సింది అదే.

భారత్ మంచితనాన్ని మెతగ్గా తీసుకునే ధోరణి మార్చాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కేంద్రం గుర్తించినట్లుంది. ఈ కారణంతోనే.. గతానికి భిన్నంగా చైనా విషయంలో సరికొత్త ఎత్తులకు శ్రీకారం చుట్టినట్లుగా కనిపిస్తోంది. గల్వామా దురాగతం చోటు చేసుకున్నంతనే.. సరిహద్దుల్లో ఉండే సైనికులు పైవారి ఆదేశాలతో పని లేకుండా తాము ఏమనుకుంటే దాన్ని అమలు చేసే విశేష అధికారాన్ని జారీ చేశారు. అక్కడితో ఆగకుండా భారత్ అమ్ములపొదిలోని కీలకమైన సుఖోయ్ 30, ఎంకేఐ.. మిరాజ్ 2000.. జాగ్వార్ యుద్దవిమానాలతో పాటు.. ఇటీవల అమెరికా నుంచి సమకూర్చుకున్న అధునాతన అపాచీ హెలికాఫ్టర్లను సరిహద్దుల్లో మొహరించింది భారత్.

పైనుంచి ఆదేశాలు వచ్చినంతనే స్పందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్ తోపాటు సిక్కిం.. అసోం.. అరుణాచల్ ప్రదేశ్ లకు మరిన్ని యుద్ధ విమానాల్ని తలిరంచారు. ఎందుకిందంతా? యుద్ధం చేయాలన్న ఆలోచన లేనప్పుడు ఇంత హడావుడి ఎందుకు? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వస్తోంది. ఇంతకాలం ఏం చేసినా భారత్ నుంచి ఆచితూచి స్పందనే తప్పించి..దూకుడు నిర్ణయాలు తక్కువన్న భావనను చెరిపివేయాలన్నది మోడీ సర్కారు యోచనగా చెప్పాలి.

తక్కువగా అంచనా వేస్తే మీకే నష్టమన్నసంకేతంతో పాటు.. మాకు నష్టం జరిగితే.. మీకు మాత్రం జరగదా? అన్న ప్రశ్న డ్రాగన్ కు కలిగేలా చేస్తున్నారని చెప్పాలి. తోక జాడితే.. కట్ చేసేందుకు ఏ మాత్రం సంశయించమన్న సందేశాన్ని కలిగించేందుకే ఇంత హడావుడి జరుగుతుందని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

7 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

10 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

10 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

11 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

11 hours ago