తెలంగాణ కాంగ్రెస్లోని విభేదాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టిస్తున్న రేవంత్రెడ్డికే హైకమాండ్ అండగా నిలిచేందుకు సిద్ధమైంది. అందుకే రేవంత్పై అసంతృప్తితో ఉన్న నేతల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్పై దాడి చేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పీసీసీ అదనపు బాధ్యతల నుంచి తొలగించడమే అందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
రేవంత్కు అండగా..
తెలంగాణలో కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలం ఉంది. కానీ పార్టీ బలోపేతంపై మాత్రం సీనియర్ నాయకులు దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. మరోవైపు రాష్ట్రంలో బలంగా ఎదుగుతున్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో పార్టీపై ఆయన ఫోకస్ పెట్టారు. కానీ పదే పదే పార్టీలోని సీనియర్ నేతల నుంచి అసంతృప్తి రేవంత్కు అడ్డుగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్కు రేవంత్ అన్ని విషయాలు వివరించారని తెలిసింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ రేవంత్కు అండగా ఉంటామని పూర్తి భరోసానిచ్చినట్లు సమాచారం.
నో అపాయింట్మెంట్..
రేవంత్పై ఆగ్రహంతో ఉన్న సీనియర్ల బృందం ఒకటి హైకమాండ్ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లింది. కానీ ఈ అసంతృప్తి నేతల విషయాన్ని అధిష్ఠానం చాలా లైట్గా తీసుకుందని సమాచారం. రేవంత్కు వ్యతిరేకంగా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని వెళ్లిన కొంతమంది సీనియర్ నాయకులకు అపాయింట్మెంట్ దొరకలేదని తెలుస్తోంది.
రెండు మూడు రోజులు అక్కడే ఉన్నా.. ముఖ్యనేతలు మాత్రం వీరిని కలవలేదని సమాచారం. దీంతో తెలంగాణ పార్టీ వ్యవహారాల్లో రేవంత్కు అధిష్ఠానం పూర్తి స్వేచ్ఛనిచ్చిందనే వార్తలు వస్తున్నాయి. పార్టీలో క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవనే సంకేతాలను రేవంత్ త్వరలోనే ఇస్తారని తెలిసింది. అందుకోసం సీనియర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు షోకాజ్ నోటీసులు అందించేందుకు టీపీసీసీ సిద్ధమవుతోందనే ప్రచారం జోరందుకుంది.
This post was last modified on March 26, 2022 12:37 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…