Political News

జ‌గ‌న్‌కు లేని స‌మ‌స్య కేసీఆర్‌కు ఎందుకు?

గ‌త కొద్దినెల‌లుగా కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర్సెస్ కేసీఆర్ స‌ర్కారు అన్న‌ట్లుగా విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్‌లో న‌డుస్తున్న టాపిక్ ధాన్యం సేక‌ర‌ణ‌. తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో చ‌ర్చించారు. అనంత‌రం వ్య‌వ‌సాయ‌ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాతపాడే పాడారని, యాసంగి వడ్ల కొనుగోలుపై క్లారిటీ ఇవ్వలేదని ఆరోపించారు. అయితే, దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది.

తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి పెద్ద ఎత్తున వ‌స్తున్న విమ‌ర్శ‌లు, టీఆర్ఎస్ వ‌ర్గాల ఆందోళ‌న‌లు, ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని, టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు.

`వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రానిది మొదటినుంచి ఒకే మాట. ఇచ్చిన టార్గెట్ కూడా తెలంగాణ పూర్తి చేయలేదు. ఏ రైతు కూడా బాయిల్డ్ రైస్ తయారుచేయడు. బాయిల్డ్ రైస్ ఇవ్వం అని రాసిచ్చినప్పుడు ఇంగితం లేదా? బాయిల్డ్ రైస్ విషయంలో ఆంధ్రాకు లేని ఇబ్బంది తెలంగాణకు మాత్రం ఎందుకు వచ్చింది.?` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

వడ్ల ఎగమతిలో ఇతర రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొస్తుందని కిష‌న్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. “తప్పుడు ప్రచారం చేయడానికి టీఆర్ఎస్ నేతలకు నోరెలా వస్తుంది. రైతుల గురించి మీకు బాధ్యత లేదా? అసలు ఇంతవరకు ఎంత పంట సాగయిందో కూడా చెప్పలేదు. దేశానికో చట్టం.. తెలంగాణకో చట్టం ఉండదు. కానీ కేసీఆర్ మాత్రం సిద్ధిపేటకో చట్టం.. దుబ్బాకకో చట్టం అమలుచేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేసీఆర్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రులకు టార్గెట్ ఇచ్చి మరీ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు.“ అంటూ కిష‌న్ రెడ్డి ఆక్షేపించారు.

This post was last modified on March 25, 2022 9:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

2 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

2 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

3 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

3 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

4 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

5 hours ago