Political News

జ‌గ‌న్‌కు లేని స‌మ‌స్య కేసీఆర్‌కు ఎందుకు?

గ‌త కొద్దినెల‌లుగా కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర్సెస్ కేసీఆర్ స‌ర్కారు అన్న‌ట్లుగా విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్‌లో న‌డుస్తున్న టాపిక్ ధాన్యం సేక‌ర‌ణ‌. తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో చ‌ర్చించారు. అనంత‌రం వ్య‌వ‌సాయ‌ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ పాతపాడే పాడారని, యాసంగి వడ్ల కొనుగోలుపై క్లారిటీ ఇవ్వలేదని ఆరోపించారు. అయితే, దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది.

తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి పెద్ద ఎత్తున వ‌స్తున్న విమ‌ర్శ‌లు, టీఆర్ఎస్ వ‌ర్గాల ఆందోళ‌న‌లు, ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని, టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జాలేస్తోందని వ్యాఖ్యానించారు.

`వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రానిది మొదటినుంచి ఒకే మాట. ఇచ్చిన టార్గెట్ కూడా తెలంగాణ పూర్తి చేయలేదు. ఏ రైతు కూడా బాయిల్డ్ రైస్ తయారుచేయడు. బాయిల్డ్ రైస్ ఇవ్వం అని రాసిచ్చినప్పుడు ఇంగితం లేదా? బాయిల్డ్ రైస్ విషయంలో ఆంధ్రాకు లేని ఇబ్బంది తెలంగాణకు మాత్రం ఎందుకు వచ్చింది.?` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

వడ్ల ఎగమతిలో ఇతర రాష్ట్రాలకు లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొస్తుందని కిష‌న్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. “తప్పుడు ప్రచారం చేయడానికి టీఆర్ఎస్ నేతలకు నోరెలా వస్తుంది. రైతుల గురించి మీకు బాధ్యత లేదా? అసలు ఇంతవరకు ఎంత పంట సాగయిందో కూడా చెప్పలేదు. దేశానికో చట్టం.. తెలంగాణకో చట్టం ఉండదు. కానీ కేసీఆర్ మాత్రం సిద్ధిపేటకో చట్టం.. దుబ్బాకకో చట్టం అమలుచేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేసీఆర్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రులకు టార్గెట్ ఇచ్చి మరీ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు.“ అంటూ కిష‌న్ రెడ్డి ఆక్షేపించారు.

This post was last modified on March 25, 2022 9:34 pm

Share

Recent Posts

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

19 minutes ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

1 hour ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

9 hours ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

10 hours ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

10 hours ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

14 hours ago