Political News

భారత్ తో చర్చలు జరపనంటోన్న నేపాల్

కొంతకాలంగా భారత్ పై చైనా కయ్యానికి కాలు దువ్వుతోన్న సంగతి తెలిసిందే. లడఖ్ ప్రాంతంలో భారత సైన్యంపై చైనా బలగాలు….కవ్వింపులకు పాల్పడుతున్నాయి. డ్రాగన్ సేనలకు భారత్ దీటుగా జవాబిస్తోంది. బలగాల ఉప సంహరణకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే చైనా బలగాలు దుందుడుకు చర్యలకు పాల్పడడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

తూర్పు లడాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన కల్నల్ సంతోష్ సహా 20 మంది సైనికులు వీరమరణం పొందగా, చైనాకు చెందిన 46 మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఓ పక్క డ్రాగన్ తో ఇండో-చైనా బోర్డర్ వద్ద ఉద్రిక్తత చల్లారక ముందే మరోవైపు పొరుగు దేశం నేపాల్ నుంచి భారత్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. దశాబ్దాలుగా ఉత్తర సరిహద్దుల్లో చైనాతో వివాదాలు కొనసాగుతుండగా….భారత్‌కు చిరకాల మిత్రుడిగా ఉన్న నేపాల్ కూడా శత్రువుల జాబితాలో చేరింది.

భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపుయాధురా భూభాగాలు తమవేనంటూ నేపాల్ కొత్త మ్యాప్‌ను రూపొందించింది. ఆ ప్రాంతాలు తమవేనని…ఆ మ్యాప్ నకు సంబంధించి భారత్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని నేపాల్ తేల్చి చెప్పింది. అంతేకాదు, తాజాగా ఆ మ్యాప్ నకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ జాతీయ అసెంబ్లీలోని ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

దీంతో, వివాదాస్పద మ్యాప్ రాజ్యాంగ సవరణ ప్రక్రియను నేపాల్ పూర్తి చేసినట్లయింది. గతవారమే ఈ బిల్లు దిగువసభలో ఆమోదం పొందింది. ఆ బిల్లుపై ఆ దేశాధ్యక్షురాలు విద్యా దేవీ భండారీ సంతకం చేయడంతో అది చట్టపరందాల్చింది.

తాజాగా ఆ బిల్లు చట్టంగా మారడంతో నేపాల్‌ జాతీయ చిహ్నంలో లింపియాధురా, లిపులేఖ్‌, కాలాపానీ ప్రాంతాలు అధికారికంగా నేపాల్ లో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్ లో కయ్యానికి నేపాల్ కాలుదువ్వుతోంది. తాజాగా, భారత్ సరిహద్దుల్లో నేపాల్ హెలీప్యాడ్‌ను నిర్మించి, సైనికుల కోసం గుడారాలు ఏర్పాటు చేసింది. కాలాపానీ, లిపులేఖ్, లింపుయాధురాలు తమ భూభాగాలేనని, వీటిపై భారత్‌కు ఎలాంటి హక్కులు లేవని నేపాల్ తేల్చి చెప్పింది. భారత వ్యతిరేక చర్యలకు నేపాల్‌ దిగడం వెనుక చైనా హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాలాపానీకి పశ్చిమంగా ఉన్న ప్రాంతం పూర్తిగా భారత్‌దే. అయితే, ఇన్నాళ్లు మిత్ర దేశంగా ఉన్న నేపాల్ తో సామరస్యపూర్వకంగానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది. అదే సమయంలో మన దేశ హక్కులకు భంగం వాటిల్లకుండా చూసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. పాత రికార్డులు, ఒప్పందాలను నేపాల్ గౌరవించాలని భారత్ సూచిస్తోంది. చైనా మాయలో పడవద్దని…కోరుతోంది.

This post was last modified on June 20, 2020 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

16 minutes ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

2 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

4 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

10 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

11 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

11 hours ago