Political News

మా విధానంలో మార్చుకునేది లేదు.. టీఆర్ఎస్‌కు కేంద్ర మంత్రి కౌంటర్!

తెలంగాణ‌, కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఏర్ప‌డిన  ధాన్యం వివాదం.. ఆస‌క్తిగా మారుతోంది. త‌మ విధానం మార్చుకునేది లేద‌ని.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. మీరు ఎలాగూ.. కేంద్రంలో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్నారు క‌దా.. అప్పుడు మీరే విధానం మార్చుకోండి! అంటూ.. స‌టైర్లు పేల్చింది. ఈ వివాదానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కార్యాల‌యం వేదిక‌గా మార‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై జరిగిన భేటీలో పీయూష్ గోయల్, మంత్రి ప్రశాంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కేంద్రం ధాన్యం సేకరణ చేయదని మంత్రులకు గోయల్‌ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని ప్రశాంత్ రెడ్డి కోరగా… మీరు ఢిల్లీలో ఎలాగో సత్తా(అధికారం)లోకి వస్తారు కదా… అప్పుడు మార్చండంటూ పీయూష్‌ స్పందించారు. భగవంతుడు దయతలిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తామని ప్రశాంత్ రెడ్డి బదులిచ్చారు. బీజేపీ కూడా ఇద్దరితో మొదలై.. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వచ్చిందని ప్ర‌శాంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భేటీకి పిలిచిన గోయల్.. 15 నిముషాల పాటు సమావేశాన్ని నిలిపివేశారు. కిషన్‌ రెడ్డి రాకపోవటంతో భేటీ కొనసాగించారు. బయట దుకాణంలో ఏది అమ్ముడు పోతుందో అదే కొంటామని కేంద్ర మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను కేంద్రమంత్రికి ప్రశాంత్ రెడ్డి చూపించారు. పంజాబ్ లో సేకరించిన విధంగా తెలంగాణలో ఎందుకు సేకరణ చేయరని ప్రశ్నించారు.

తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ చేయమని.. బియ్యం మాత్రమే తీసుకుంటామని పీయూష్‌ గోయల్‌ తేల్చి చెప్పారు. అనంత‌రం.. కేంద్ర మంత్రి పీయూష్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లే చేయ‌డం గ‌మ‌నార్హం. అవినీతి స‌ర్కారు అంటూ.. ఆయ‌న వ్యాఖ్య‌లు గుప్పించారు. మొత్తంగా .. తెలంగాణ లో టీఆర్ ఎస్ వ్యూహం ఫ‌లించ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. 

This post was last modified on March 25, 2022 9:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

1 hour ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago