తెలంగాణ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ధాన్యం వివాదం.. ఆసక్తిగా మారుతోంది. తమ విధానం మార్చుకునేది లేదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు.. మీరు ఎలాగూ.. కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్నారు కదా.. అప్పుడు మీరే విధానం మార్చుకోండి! అంటూ.. సటైర్లు పేల్చింది. ఈ వివాదానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కార్యాలయం వేదికగా మారడం గమనార్హం. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై జరిగిన భేటీలో పీయూష్ గోయల్, మంత్రి ప్రశాంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కేంద్రం ధాన్యం సేకరణ చేయదని మంత్రులకు గోయల్ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని ప్రశాంత్ రెడ్డి కోరగా… మీరు ఢిల్లీలో ఎలాగో సత్తా(అధికారం)లోకి వస్తారు కదా… అప్పుడు మార్చండంటూ పీయూష్ స్పందించారు. భగవంతుడు దయతలిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తామని ప్రశాంత్ రెడ్డి బదులిచ్చారు. బీజేపీ కూడా ఇద్దరితో మొదలై.. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వచ్చిందని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని భేటీకి పిలిచిన గోయల్.. 15 నిముషాల పాటు సమావేశాన్ని నిలిపివేశారు. కిషన్ రెడ్డి రాకపోవటంతో భేటీ కొనసాగించారు. బయట దుకాణంలో ఏది అమ్ముడు పోతుందో అదే కొంటామని కేంద్ర మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను కేంద్రమంత్రికి ప్రశాంత్ రెడ్డి చూపించారు. పంజాబ్ లో సేకరించిన విధంగా తెలంగాణలో ఎందుకు సేకరణ చేయరని ప్రశ్నించారు.
తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ చేయమని.. బియ్యం మాత్రమే తీసుకుంటామని పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. అనంతరం.. కేంద్ర మంత్రి పీయూష్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలే చేయడం గమనార్హం. అవినీతి సర్కారు అంటూ.. ఆయన వ్యాఖ్యలు గుప్పించారు. మొత్తంగా .. తెలంగాణ లో టీఆర్ ఎస్ వ్యూహం ఫలించలేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 25, 2022 9:01 am
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…