Political News

వైసీపీలో కొత్త కుంప‌టి.. సెగ‌లు రేపుతున్న జ‌గ‌న్ నిర్ణ‌యం

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప‌ద‌వులు కోల్పోయిన వారిని సంతృప్తి పరిచేందుకు సీఎం జ‌గ‌న్ వారిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రూ ప‌ద‌వులు పోయాయ‌ని బాధ‌ప డొద్దు.. అంద‌రికీ న్యాయం చేస్తాను. అయితే.. పమంత్రి వ‌ర్గంలో కాక‌పోతే.. జిల్లాల‌కు ఇంచార్జ్‌లుగా నియ‌మిస్తాను.. అని హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు వైసీపీలో కొత్త కుంప‌టికి దారితీసింది. ఎందుకంటే.. ఇప్ప‌టికే.. స‌ద‌రు మంత్రుల‌తో చాలా మంది నేత‌ల‌కు ప‌డ‌డం లేదు. మంత్రులే పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. త‌మ‌కు క‌నీసం కూడా విలువ ఇవ్వ‌డం లేద‌ని.. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. కేడ‌ర్ కూడా తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

అందుకే.. దాదాపు ఏడాదిన్న‌ర కాలంలో మంత్రుల‌తో కీల‌క నేత‌లు అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫ‌లితంగా నియోజ‌క వర్గాల్లో నేత‌ల మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయి.. పార్టీ ఇబ్బంది ప‌డుతోంది. ఇలాంటి స‌మ‌యంలో వారు ఎప్పుడు మంత్రులుగా దిగిపోతారా? అని ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూసిన ప‌రిస్థితి ఉంది. తూర్పు, ప‌శ్చిమ గోదావరి జిల్లాల‌లో కొంద‌రు మంత్రుల‌కు వ్య‌తిరేకంగా.. సొంత పార్టీలోనే కూట‌ములు తెర‌మీదికి వ‌చ్చాయి. బ‌హిరంగ విమ‌ర్శ‌లు కూడా చేసుకున్నారు. కులాల పేరుతోనూ రాజ‌కీయాలు చేశారు.

అంతేకాదు.. బ‌ల‌మైన నేత‌లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు డ‌మ్మీలు అయిపోతే.. మంత్రులు బలంగా ఉన్న చోట‌.. నాయ కులు డ‌మ్మీలు అయ్యారు. దీంతో ప్ర‌తి విష‌యంలోనూ.. నేత‌ల‌కు, మంత్రుల‌కు కీచులాట‌లు ష‌రామామూలే అన్న‌ట్టుగా మారి పోయాయి. ఫ‌లితంగా.. ఈ మంత్రుల‌ను సాగ‌నంపాల్సిందే.. అన్న‌ట్టుగా నాయ‌కులు ప్ర‌చారం చేశారు. అంతేకాదు.. వారి ప‌ద‌వులు ఎప్పుడు ఊడిపోతాయా? అని కూడా ఎదురు చూశారు. ఇక‌, స‌మ‌యం రానేవ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డుతున్న స‌మ‌యం లో.. సీఎం జ‌గ‌న్ ఒక్క‌సారిగా షాక్ ఇచ్చారు. ఈ తీసేసే మంత్రుల‌ను  జిల్లాల‌కు ఇంచార్జ్‌ల‌ను చేస్తాన‌ని.. వారికిగౌర‌వం, హోదా ఏమాత్రం త‌గ్గ‌ద‌ని చెప్పుకొచ్చారు.

అంటే.. మంత్రులుగా ఉండి.. వివాదాల‌కు కేంద్రాలుగా మారిన వారు.. ఆయా ప‌ద‌వులు కోల్పోయినా.. ఇప్పుడు అదే జిల్లాల‌కు ఇంచార్జ్‌లు అవుతారు. అంటే.. మ‌రింత‌గా వారికి నేత‌ల‌కు మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌డంంతోపాటు.. వివాదాలు మ‌రింత తార‌స్థాయికి చేర‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.,. సీనియ‌ర్లు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ సంతృప్తి ప‌ర‌చాల్సిన అవ‌స‌రం లేద‌ని.. నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. జిల్లాల్లోనూ ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నించి.. ముందుకు సాగితే చాలని.. లేక‌పోతే.. వ్య‌క్తుల‌ను సంతృప్తి చేయాల‌నే ఉద్దేశంతో ముందుకు సాగితే.. పార్టీనే తీవ్ర అసంతృప్తిలో మునిగిపోతుంద‌ని అంటున్నారు. 

This post was last modified on March 24, 2022 9:59 am

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

2 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

4 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

6 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

6 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

6 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

7 hours ago