Political News

టీడీపీ దూకుడు భేష్‌.. కానీ, ఇలా కావ‌డం బాగోలేదు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చేస్తున్న దూకుడును ప్ర‌శంసి స్తున్నారు. వాస్త‌వానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాను చేసిన శ‌ప‌థం నేప‌థ్యంలో స‌భ‌కు రావ‌డం లేదు దీంతో త‌మ‌కు స‌భ‌ను డీల్ చేయ‌డం ఈజీనేన‌ని.. వైసీపీ నాయ‌కులు భావించారు. మ‌రీ ముఖ్యంగా సీఎం స‌హా స‌భాప‌తి కూడా టీడీపీ అధినేత రంగంలో లేక‌పోవ‌డంతో త‌మ‌కు ప‌ని సులువు అవుతుంద‌ని అనుకున్నారు. కానీ.. అలా జ‌ర‌గ‌డం లేదు. పైగా ఉన్న 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీకి చుక్క‌లు చూపిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

నిజానికి  ఇప్పుడు స‌భ‌లో 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్న‌ప్ప‌టికీ.. అసెంబ్లీలో టీడీపీ స‌త్తా చాటుతు న్నారు. దీంతో ప్ర‌భుత్వంపై పైచేయి సాధించేలా వ్య‌వహ‌రిస్తున్నార‌ని మేధావులు సైతం అంటున్నారు. ముఖ్యంగా జంగా రెడ్డి గూడెం ఘ‌ట‌న‌కు సంబంధించి.. అసెంబ్లీలో టీడీపీ నేత‌లు ఆస‌క్తిక‌ర వాయిస్ వినిపించారు. ఈ క్రమంలో అధికార పార్టీ స‌భ్యులు.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితిని క‌ల్పించా రు. గ‌తంలో చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న పార్టీ నాయ‌కులు అసెంబ్లీలో గ‌ళం వినిపించేవారు.

అయితే.. ఇప్పుడు .. చంద్ర‌బాబు స‌భ‌కు వెళ్ల‌డంలేదు. దీంతో టీడీపీలో లోటు క‌నిపిస్తుంద‌ని… అధికార ప‌క్షం స‌భ‌లో పైచేయి సాధించ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు.. స‌భ‌లో పార్టీ నేత‌లు వాయిస్ కూడా వినిపించే ప్ర‌య‌త్నం చేయ‌లేర‌ని కూడా  కొంద‌రు వైసీపీ నేత‌లు భావించారు. అయితే.. అనూహ్యంగా టీడీపీ నాయ‌కులు.. అధికార పార్టీపై పుంజుకునే ప్ర‌య‌త్నం చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం రోజు.. నుంచి వ‌రుస‌గా వారు స‌భ‌లో అధికార పార్టీని నిలదీసిన వైనం.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స‌మావేశాల్లో టీడీపీ అనుస‌రించిన వ్యూహాల‌కు భిన్నంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది.  

అదేవిధంగా బ‌డ్జెట్‌పైచ‌ర్చ సంద‌ర్భంగా.. జంగారెడ్డి గూడెం మ‌ర‌ణాల అంశాన్ని ప్ర‌స్తావించారు. ఈ ప‌రిణామం.. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టింది. అంతేకాదు.. ఎదురు దాడి చేసి… ఆత్మ‌ర‌క్ష‌ణ ప‌రిస్థితిని ఎదుర్కొనాల్సి రావ‌డం వైసీపీకి మ‌రింత ఇబ్బంది క‌రంగా మారింది. అయితే.. ఇక్క‌డ టీడీపీ నేత‌ల దూకుడు.. వారు స‌స్పెండ్ అయ్యేలా దారితీస్తోంది. ఈ విష‌యంలో వారు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటే.. పార్టీ వాయిస్ వినిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని..  ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు కూడా ఉంటుంద‌ని మేధావులు చెబుతున్నారు. ఈ ఒక్క విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని.. స‌స్పెండ్ కాకుండా.. చూసుకోవాల‌ని.. దూకుడు మాత్రం కొన‌సాగించాల‌ని.. మేధావులు నుంచి కూడా సూచ‌న‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారోచూడాలి. 

This post was last modified on March 20, 2022 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

1 hour ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago