Political News

పోల‌వ‌రం లెక్క‌లు తీయండి.. కేంద్రం ఆదేశం: ఏపీకి మ‌రో ఇర‌కాటం

పోలవ‌రం ప్రాజెక్టు. అవునా..కాదా.. అన్న‌ట్టుగా ప‌నులు జ‌రుగుతున్న ఈ ప్రాజెక్టులో అంతో ఇంతో కొంత ప‌నులు పుంజుకుంటున్నాయ‌ని.. అంద‌రూ సంబ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం.. ఏపీని మ‌రో ఇర‌కాటంలోకి నెట్టేసింది. 2004లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప‌నుల‌కు సంబంధించి అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. తొలిద‌శ వ‌ర‌కు ఎంత ఖ‌ర్చు చేశారు?  ఏం చేశారు? వంటి వివ‌రాల‌ను ఇవ్వాల‌ని… ఏపీ ప్ర‌భుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఈ విష‌యంపై స‌ర్వ‌త్రా అనేక సందేహాలు అలుముకున్నాయి.

విష‌యం.. ఇదీ..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు వెచ్చించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మ‌రో మెలిక పెట్టింది. ప్రాజెక్టు తొలిదశలో +41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిల్వచేసి కుడి, ఎడమ కాలువలకు, ఆయకట్టుకు ఇవ్వాలంటే ఆ స్థాయి నిర్మాణానికి, పునరావాసానికి ఎంత ఖర్చవుతుందని మళ్లీ లెక్కలు అడుగుతోంది. అక్కడివరకు నీళ్లు ఇస్తే ఏ స్థాయి ప్రయోజనాలు కలుగుతాయో చెప్పాల‌ని కేంద్ర జలసంఘం గతంలోనే ఒక సమావేశం ఏర్పాటుచేసి వివరాలు కోరింది.

పోలవరం డ్యాంను +45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అనుగుణంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం లెక్కలు కట్టించాయి. 2013-14 లెక్కల్లో కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం ఎంత? రివైజ్డు కాస్ట్‌ కమిటీ ప్రకారం ఎంతో కూడా లెక్క కట్టించారు. 2017-18 ధరల ప్రకారం ఆర్‌సీసీ రూ.47,725.74 కోట్లకు సిఫార్సు చేసింది. ఇది జరిగి రెండేళ్లు దాటింది. ఈ మొత్తానికి కేంద్రం పెట్టుబడి అనుమతి ఇచ్చి పనులను తొలిదశ, రెండో దశగా విడగొట్టి ఆ మేరకు నిధులు విడుదల చేస్తే సరిపోయేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే.. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి.. ఇప్పుడు ప్రత్యేకంగా తొలిదశ పేరుతో మళ్లీ లెక్కలు కట్టాలని కోరుతోంది. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎప్పటికప్పుడు లెక్కలు కడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ కేంద్రం దీన్ని కొలిక్కి తెచ్చి పెట్టుబడి అనుమతి ఇచ్చేందుకు అడుగు ముందుకు వేయలేదు. ఇప్పటికే ప్రాజెక్టులో అన్ని విభాగాలకు సంబంధించిన ఖర్చుల లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి.

పైగా పునరావాసంలో +41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలిపితే ఎంత? ఆ తర్వాత +45.72 మీటర్ల స్థాయికి నీరు నిలిపితే ఎంత ఖర్చవుతుందో కూడా లెక్కలేశారు. ఆర్‌సీసీ ఆమోదించిన 2017-18 లెక్కల ఖర్చుకు పెట్టుబడి అనుమతి ఇచ్చి, నిధులు విడుదల చేస్తూ తొలిదశ, మలి దశగా విడగొట్టే అవకాశం ఉంది.  మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

ఆలస్యం చేస్తే అమృతం విషమే

పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…

3 hours ago

వైసీపీకి వచ్చేది తక్కువ… పోయేది ఎక్కువ!

వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు ప‌డిపోయింది. దీనికి కార‌ణాలు ఏంటన్న‌వి అంద‌రికీ తెలిసినా..…

4 hours ago

మూడో పొలిమేర… ఇంకా పెద్దగా?

కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్‌ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…

4 hours ago

బుల్లెట్ రైలుకు `రాజకీయ` రెడ్ సిగ్న‌ల్‌?!

తెలంగాణకు కీల‌క ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీల‌కంగా మార‌నుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్ల‌ను కేంద్ర…

5 hours ago

గ్రీన్ డ్రెస్ లో రాశీ గ్లామర్ మెరుపులు

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…

9 hours ago

ట్రోజన్ హార్స్… జక్కన్న చేతిలో పడుంటే?

క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…

12 hours ago