రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు అనేటోళ్లు ఉండరు. రాజకీయంగా నిప్పులా ఉప్పులా ఉండే వారు సైతం వ్యక్తిగత జీవితాల్లో మాత్రం మంచి స్నేహితులుగా ఉండొచ్చు. అందుకు ఉదాహరణగా ఏపీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేత వంగవీటి రాధాలను చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తూర్పు పడమర లాంటి పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం రాజకీయాలకు అతీమని చెబుతుంటారు.
ఏపీ అధికార విపక్ష పార్టీ నేతలు కలవటం సంగతి తర్వాత.. ముఖ ముఖాలు చూసుకునే పరిస్థితి లేదు.
అలాంటి వేళలో కొడాలి నాని.. వంగవీటి రాధాలు ఇద్దరూ ఒకే ఆటోలో కూర్చొని చాలా సింఫుల్ గా టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకున్న వైనం తాజాగా చోటు చేసుకుంది.
ఈ అరుదైన సీన్ కు వేదికగా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ మాజీ వైస్ ఛైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) అంతిమ యాత్రకు మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీ నేత వంగవీటి రాధలు హాజరయ్యారు. తమకు సన్నిహితుడైన బాబ్జి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఈ ఇద్దరు నేతలు అతి సాధారణంగా అక్కడే ఉన్న ఒక ఆటోలో కూర్చున్నారు. ఈ ఫైర్ బ్రాండ్ నేతల మధ్య మంచి స్నేహం.. సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే.
ఏదోలా వంగవీటి రాధను మంత్రి కొడాలి నాని వైసీపీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అది వర్కువుట్ కాలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తమ ఇమేజ్ ను.. తమకున్న పలుకుబడిని పక్కన పెట్టేసి.. ఒకే ఆటోలో.. సాదాసీదాగా కూర్చొని.. పేపర్ కప్పుల్లో టీ తాగిన సందర్భంగా పలువురు వారిద్దరు కలిసి ఉన్న రేర్ కాంబినేషన్ ను ఫోటోలుగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. తెలుగు రాజకీయాల్లో.. అందునా ఏపీ పాలిటిక్స్ లో ఇలాంటి సీన్ అరుదైనదనే చెప్పాలి.
This post was last modified on March 20, 2022 1:27 pm
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…