రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు అనేటోళ్లు ఉండరు. రాజకీయంగా నిప్పులా ఉప్పులా ఉండే వారు సైతం వ్యక్తిగత జీవితాల్లో మాత్రం మంచి స్నేహితులుగా ఉండొచ్చు. అందుకు ఉదాహరణగా ఏపీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేత వంగవీటి రాధాలను చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తూర్పు పడమర లాంటి పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం రాజకీయాలకు అతీమని చెబుతుంటారు.
ఏపీ అధికార విపక్ష పార్టీ నేతలు కలవటం సంగతి తర్వాత.. ముఖ ముఖాలు చూసుకునే పరిస్థితి లేదు.
అలాంటి వేళలో కొడాలి నాని.. వంగవీటి రాధాలు ఇద్దరూ ఒకే ఆటోలో కూర్చొని చాలా సింఫుల్ గా టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకున్న వైనం తాజాగా చోటు చేసుకుంది.
ఈ అరుదైన సీన్ కు వేదికగా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ మాజీ వైస్ ఛైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) అంతిమ యాత్రకు మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీ నేత వంగవీటి రాధలు హాజరయ్యారు. తమకు సన్నిహితుడైన బాబ్జి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఈ ఇద్దరు నేతలు అతి సాధారణంగా అక్కడే ఉన్న ఒక ఆటోలో కూర్చున్నారు. ఈ ఫైర్ బ్రాండ్ నేతల మధ్య మంచి స్నేహం.. సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే.
ఏదోలా వంగవీటి రాధను మంత్రి కొడాలి నాని వైసీపీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అది వర్కువుట్ కాలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తమ ఇమేజ్ ను.. తమకున్న పలుకుబడిని పక్కన పెట్టేసి.. ఒకే ఆటోలో.. సాదాసీదాగా కూర్చొని.. పేపర్ కప్పుల్లో టీ తాగిన సందర్భంగా పలువురు వారిద్దరు కలిసి ఉన్న రేర్ కాంబినేషన్ ను ఫోటోలుగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. తెలుగు రాజకీయాల్లో.. అందునా ఏపీ పాలిటిక్స్ లో ఇలాంటి సీన్ అరుదైనదనే చెప్పాలి.
This post was last modified on March 20, 2022 1:27 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…