రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు అనేటోళ్లు ఉండరు. రాజకీయంగా నిప్పులా ఉప్పులా ఉండే వారు సైతం వ్యక్తిగత జీవితాల్లో మాత్రం మంచి స్నేహితులుగా ఉండొచ్చు. అందుకు ఉదాహరణగా ఏపీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేత వంగవీటి రాధాలను చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తూర్పు పడమర లాంటి పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం రాజకీయాలకు అతీమని చెబుతుంటారు.
ఏపీ అధికార విపక్ష పార్టీ నేతలు కలవటం సంగతి తర్వాత.. ముఖ ముఖాలు చూసుకునే పరిస్థితి లేదు.
అలాంటి వేళలో కొడాలి నాని.. వంగవీటి రాధాలు ఇద్దరూ ఒకే ఆటోలో కూర్చొని చాలా సింఫుల్ గా టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకున్న వైనం తాజాగా చోటు చేసుకుంది.
ఈ అరుదైన సీన్ కు వేదికగా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ మాజీ వైస్ ఛైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) అంతిమ యాత్రకు మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీ నేత వంగవీటి రాధలు హాజరయ్యారు. తమకు సన్నిహితుడైన బాబ్జి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఈ ఇద్దరు నేతలు అతి సాధారణంగా అక్కడే ఉన్న ఒక ఆటోలో కూర్చున్నారు. ఈ ఫైర్ బ్రాండ్ నేతల మధ్య మంచి స్నేహం.. సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే.
ఏదోలా వంగవీటి రాధను మంత్రి కొడాలి నాని వైసీపీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అది వర్కువుట్ కాలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తమ ఇమేజ్ ను.. తమకున్న పలుకుబడిని పక్కన పెట్టేసి.. ఒకే ఆటోలో.. సాదాసీదాగా కూర్చొని.. పేపర్ కప్పుల్లో టీ తాగిన సందర్భంగా పలువురు వారిద్దరు కలిసి ఉన్న రేర్ కాంబినేషన్ ను ఫోటోలుగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. తెలుగు రాజకీయాల్లో.. అందునా ఏపీ పాలిటిక్స్ లో ఇలాంటి సీన్ అరుదైనదనే చెప్పాలి.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…