Political News

వైసీపీ ప్ర‌భుత్వంలో ఆర్థిక అరాచ‌కం.. కేంద్రం వెల్ల‌డి

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచ‌కానికి, అవకతవకలకు పాల్పడినట్లు కేంద్రం పేర్కొంది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా కాగ్‌ నిర్ధారించిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ‘వైఎస్ఆర్‌ గృహవసతి’ ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని పేర్కొంది.

2020 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించి కాగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. జాతీయ విపత్తు నిధి కింద రూ.570.91 కోట్లు ఏపీకి ఇచ్చామని కేంద్రం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం రూ.1,100 కోట్ల విపత్తు నిధులను… రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు మళ్లించారని తెలిపింది. అయితే ఆ రూ.1,100 కోట్లు పంట నష్టపోయిన రైతులకు అందకుండా… అగ్రికల్చరల్ డైరెక్టరేట్ కమిషనర్ ఖాతాకు బదిలీ అయ్యాయని వెల్లడించింది.

విపత్తు సాయానికి ఖర్చు చేసినట్లుగా ఏపీ ప్రభుత్వం చూపించి ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిపింది. ఈ వ్యవహారం విపత్తు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే రాష్ట్రం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు తెలిపిందని కేంద్రం పేర్కొంది. బడ్జెట్‌ మొదటి విడత సమావేశాల్లో 377 నిబంధన కింద తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు లేవనెత్తిన అంశాలకు కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వకంగా తెలియజేసింది.

This post was last modified on March 20, 2022 1:03 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

52 mins ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

56 mins ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

1 hour ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

2 hours ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

3 hours ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

4 hours ago