Political News

నా ఆస్తి పందెం… జగనే మళ్లీ సీఎం: ఏపీ మంత్రి

తమకున్న ఆత్మవిశ్వాసాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తుంటారు. అందుకు భిన్నంగా తాను అమితంగా అభిమానించి ఆరాధించే అధినాయకుడి గురించిన ఆత్మవిశ్వాసాన్ని చాలా తక్కువ మంది ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు ఆ కోవలోకే చేరారు ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. తాజాగా ఆయనో భీకర సవాలు విసిరారు. ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడన్న పేరున్న ఆయన.. జగన్ కు వీర విధేయుడన్న సంగతి తెలిసిందే.

తాజాగా శ్రీకాకుళం జిల్లా పోలాకి..చెల్లాయి వలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి సంచలన సవాలు బయటకు వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. అయినప్పటికీ.. ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో.. ఏ క్షణంలో అయినా ఎన్నికలు వస్తాయన్న మాట వినిపిస్తూ ఉంది. విపక్ష నేత ఇప్పటికే పలుమార్లు.. ఎన్నికలకు సిద్దంగా ఉండాలంటూ తమ పార్టీ నేతలకు.. క్యాడర్ కు తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే.
దీంతో.. ఎన్నికల హీట్ రెండేళ్ల ముందే మొదలైంది.

ఇలాంటి వేళ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేవారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. అంతేకాదు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు ఆయనో సవాలు విసిరారు. ఒకవేళ ఏపీ ఎన్నికల్లో జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే.. తన ఆస్తులు మొత్తాన్ని రాసి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చారు.

రాష్ట్రానికి వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి నభుతో నభవిష్యతి అంటూ ఆకాశానికి ఎత్తేసిన ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
జగన్ ను అభిమానించి.. ఆరాధించే మంత్రులు.. నేతలు.. క్యాడర్ చాలానే ఉన్నా.. ఈ తరహాలో ఉన్న ఆస్తి మొత్తాన్ని రాసిచ్చేస్తానంటూ సంచలన సవాలు మాత్రం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒక్కరికే చెల్లిందని చెప్పాలి. ఏమైనా.. అందరి మంత్రుల్లో ధర్మాన ఇస్పెషల్ అన్న రీతిలో ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. అదే సమయంలో.. జగన్ విజయం మీద ఆయనకున్న నమ్మకం తాజా సవాలుతో స్పష్టమవుతుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on March 20, 2022 1:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

8 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago