Political News

ఏపీ వైద్యులకు జగన్ పెట్టిన సెల్ఫీ పరీక్ష

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు గుదిబండలా మారడమే కాదు.. పేషెంట్లకు వైద్యం చేయటం కంటే.. రోజువారీగా పోస్టు చేయాల్సిన సెల్ఫీలతోనే పుణ్యకాలం గడిచేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు తీసుకున్న ఈ సెల్ఫీ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు.

కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ పాలసీ ప్రకారం చూస్తే.. ఏపీ వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ వైద్యులు ప్రతి రెండు గంటలకు ఒకసారి తమ సెల్ఫీని పోస్టు చేయాల్సి ఉంటుంది. అది కూడా తాము పని చేసే ఆసుపత్రి ఆవరణ స్పష్టంగా కనిపించాలి. ఈ తీరులో రోజుకు ఐదు సార్లు సెల్ఫీలు దిగి పోస్టు చేయటంతో పాటు.. ఈ లెక్కలో ఏ చిన్న తేడా వచ్చినా నెలవారీ జీతంలో కోత పెడతామన్న మాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అంతేకాదు.. ప్రభుత్వ వైద్యులు తమ ఇంటి వద్ద చేసుకునే ప్రైవేట్ ప్రాక్టీస్ విషయంలోనూ పరిమితులు విధించారు. దీంతో.. వారంతా రోజు మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికే పరిమితం కావాలే తప్పించి.. ప్రైవేటు ప్రాక్టీసు వైపు కన్నెత్తి చూసే అవకాశం ఉండదని చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఏపీని సెల్ఫీ ప్రదేశ్ గా మారుస్తున్నారన్న మండిపాటు వ్యక్తమవుతోంది. కొత్తగా తీసుకురావాలని భావిస్తున్న ఈ సెల్ఫీ విధానానికి కచ్చితమైన మార్గదర్శకాల్ని సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే బయో మెట్రిక్ తోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అది సరిపోదన్నట్లుగా ఇప్పుడు ఏకంగా సెల్ఫీలు దిగి పోస్టు చేయటం.. వాటిల్లో ఆసుపత్రి బ్యాక్ గ్రౌండ్ పక్కాగా ఉండాలని చెబుతున్న వైనంపై మండిపాటు వ్యక్తమవుతోంది. రోజుకు ఐదు సెల్ఫీలు పోస్ట్ చేయాలన్న ఆలోచనపై మహిళా వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను ఇబ్బందులకు గురి చేస్తాయని వాదిస్తున్నారు. సెల్ఫీలు ఏ మాత్రం అప్ లోడ్ చేయకున్నా.. జీతాల్లో కోత పెడతారన్న మాటపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరి.. వైద్యుల విషయంలో అమల్లోకి రానున్న ఈ సెల్ఫీ పరీక్ష జగన్ ప్రభుత్వంపై మరింత నెగిటివిటీ పెంచేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on March 18, 2022 4:47 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

22 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

34 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

4 hours ago