Political News

ఏపీ వైద్యులకు జగన్ పెట్టిన సెల్ఫీ పరీక్ష

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు గుదిబండలా మారడమే కాదు.. పేషెంట్లకు వైద్యం చేయటం కంటే.. రోజువారీగా పోస్టు చేయాల్సిన సెల్ఫీలతోనే పుణ్యకాలం గడిచేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు తీసుకున్న ఈ సెల్ఫీ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు.

కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ పాలసీ ప్రకారం చూస్తే.. ఏపీ వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ వైద్యులు ప్రతి రెండు గంటలకు ఒకసారి తమ సెల్ఫీని పోస్టు చేయాల్సి ఉంటుంది. అది కూడా తాము పని చేసే ఆసుపత్రి ఆవరణ స్పష్టంగా కనిపించాలి. ఈ తీరులో రోజుకు ఐదు సార్లు సెల్ఫీలు దిగి పోస్టు చేయటంతో పాటు.. ఈ లెక్కలో ఏ చిన్న తేడా వచ్చినా నెలవారీ జీతంలో కోత పెడతామన్న మాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అంతేకాదు.. ప్రభుత్వ వైద్యులు తమ ఇంటి వద్ద చేసుకునే ప్రైవేట్ ప్రాక్టీస్ విషయంలోనూ పరిమితులు విధించారు. దీంతో.. వారంతా రోజు మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికే పరిమితం కావాలే తప్పించి.. ప్రైవేటు ప్రాక్టీసు వైపు కన్నెత్తి చూసే అవకాశం ఉండదని చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఏపీని సెల్ఫీ ప్రదేశ్ గా మారుస్తున్నారన్న మండిపాటు వ్యక్తమవుతోంది. కొత్తగా తీసుకురావాలని భావిస్తున్న ఈ సెల్ఫీ విధానానికి కచ్చితమైన మార్గదర్శకాల్ని సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే బయో మెట్రిక్ తోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అది సరిపోదన్నట్లుగా ఇప్పుడు ఏకంగా సెల్ఫీలు దిగి పోస్టు చేయటం.. వాటిల్లో ఆసుపత్రి బ్యాక్ గ్రౌండ్ పక్కాగా ఉండాలని చెబుతున్న వైనంపై మండిపాటు వ్యక్తమవుతోంది. రోజుకు ఐదు సెల్ఫీలు పోస్ట్ చేయాలన్న ఆలోచనపై మహిళా వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను ఇబ్బందులకు గురి చేస్తాయని వాదిస్తున్నారు. సెల్ఫీలు ఏ మాత్రం అప్ లోడ్ చేయకున్నా.. జీతాల్లో కోత పెడతారన్న మాటపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరి.. వైద్యుల విషయంలో అమల్లోకి రానున్న ఈ సెల్ఫీ పరీక్ష జగన్ ప్రభుత్వంపై మరింత నెగిటివిటీ పెంచేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on March 18, 2022 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

29 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago