ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. సిక్కుల కోటలో కాంగ్రెస్, బీజీపీ సీట్లను చీపురు పెట్టి క్లీన్ స్వీప్ చేశారు కేజ్రీవాల్. భగవంత్ మాన్ వంటి యువనేతను పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. పంజాబ్లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్…మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో, పంజాబ్లోని మొత్తం 5 రాజ్యసభ స్థానాలు ఆప్ ఖాతాలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఐదుగురిలో ఒకరిగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ను ఆప్ తరఫున రాజ్యసభకు పంపాలని కేజ్రీవాల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
పంజాబ్ సీఎంగా ఎన్నికైన భగవంత్ మాన్ కు హర్భజన్ సింగ్ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. పంజాబ్ నుంచి ఎన్నికైన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్లో ముగియనుంది. దీంతో, ఆ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ను ఈసీ విడుదల చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 21 కాగా, మార్చి 31న పోలింగ్, కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనున్నారు.
పంజాబ్ కు సేవ చేయాలనుందని, రాజకీయాల ద్వారానా, వేరే రూపంలోనా అన్నది కాలమే నిర్ణయిస్తుందని భజ్జీ గతంలో చెప్పాడు. సమాజం తనకు ఎంతో ఇచ్చిందని, సమాజానికి తిరిగిచ్చే సమయం ఆసన్నమైందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. దీంతో, 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు అమృత్సర్ లోక్ సభ స్థానం నుంచి భజ్జీని బరిలోకి దింపడానికి బీజేపీ గాలం వేసినా టర్బోనేటర్ పడలేదు. అయితే, తాజాగా ఆప్ తరఫున రాజ్యసభకు వెళ్లేందుకు హర్భజన్ సింగ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఎన్నికల ప్రచారం సందర్భంగా జలంధర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. ఆ స్పోర్ట్స్ యూనివర్శిటీ నిర్మాణం, తదితర బాధ్యతలను కూడా భజ్జీకే అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. అయితే, క్రీడాకారుడిగా భజ్జీ తన దూకుడుతో పలు వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ఆసీస్ మాజీ క్రికెటర్ సైమండ్స్ తో మంకీ గేట్ వివాదం…ఐపీఎల్ సందర్భంగా శ్రీశాంత్ పై చేయి చేసుకోవడం వంటి వ్యవహారాల్లో భజ్జీ తీరు వివాదాస్పదమైంది. మరి, క్లీన్ ఇమేజ్ ఉన్న ఆప్ తరఫున భజ్జీ పెద్దల సభకు వెళతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on March 17, 2022 12:55 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…