పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. గడిచిన వారం రోజుల్లో కల్తీ సారా తాగి దాదాపు 26 మంది మరణించడం రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబాలకు పరామర్శించిన చంద్రబాబు.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. తనను కలవవద్దంటూ బాధిత కుటుంబాలలోని మహిళలను వైసీపీ నేతలు బెదిరించడంపై చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబును కలిస్తే పెన్షన్ కూడా ఆపేస్తామని బెదిరించారని అక్కడి మహిళలు వాపోవడంతో చంద్రబాబు నిప్పులు చెరిగారు. నాడు గొడ్డలి పోటును గుండెపోటు అని చెప్పిన జగన్…ఈ రోజు కల్తీ సారా మరణాలను సహజ మరణాలంటున్నారని ఆరోపించారు. సిగ్గులేకుండా ఆ మరణాలను దాచిపెడుతున్నారని విమర్శించారు.
తాను చేసేవి ప్రజా రాజకీయాలని, వివేకా హత్యలో తనపై నిందలు వేశారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మద్యపాన నిషేధం ఏమయ్యిందని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లు తేవడమే మద్యపాన నిషేధమా? అంటూ ఫైర్ అయ్యారు. మద్యం రేట్లు పెంచడం వల్ల తాగేవాళ్లు తగ్గలేదని, కల్తీ, నాసిరకం, నాటు సారా తాగి చనిపోయే వాళ్ల సంఖ్య పెరిగిందని అన్నారు. కమిషన్ల కోసమే వైన్ షాప్స్ లో ఆన్లైన్ చెల్లింపులు పెట్టడం లేదని ఆరోపించారు.
టీడీపీ లేకుంటే చనిపోయిన కుటుంబాలవైపు ప్రభుత్వం చూసేది కాదని, వైసీపీ నేతల అవినీతి అనకొండ అంతటి అవినీతి అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున పార్టీ నుంచి ఆర్థికసాయం అందించనుందని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వివాఖ ఎల్జీ పాలిమర్స్ తప్పు వల్ల జనం చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని, ఇవి కూడా ప్రభుత్వం చేసిన హత్యలేనని, కాబట్టి పరిహారం ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందిస్తామన్నారు.
This post was last modified on March 15, 2022 9:07 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…