Political News

26 తాళిబొట్లు తెంచిన వ్యక్తి జగన్: చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. గడిచిన వారం రోజుల్లో కల్తీ సారా తాగి దాదాపు 26 మంది మరణించడం రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పర్యటించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబాలకు పరామర్శించిన చంద్రబాబు.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. తనను కలవవద్దంటూ బాధిత కుటుంబాలలోని మహిళలను వైసీపీ నేతలు బెదిరించడంపై చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబును కలిస్తే పెన్షన్ కూడా ఆపేస్తామని బెదిరించారని అక్కడి మహిళలు వాపోవడంతో చంద్రబాబు నిప్పులు చెరిగారు. నాడు గొడ్డలి పోటును గుండెపోటు అని చెప్పిన జగన్…ఈ రోజు కల్తీ సారా మరణాలను సహజ మరణాలంటున్నారని ఆరోపించారు. సిగ్గులేకుండా ఆ మరణాలను దాచిపెడుతున్నారని విమర్శించారు.

తాను చేసేవి ప్రజా రాజకీయాలని, వివేకా హత్యలో తనపై నిందలు వేశారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మద్యపాన నిషేధం ఏమయ్యిందని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లు తేవడమే మద్యపాన నిషేధమా? అంటూ ఫైర్ అయ్యారు. మద్యం రేట్లు పెంచడం వల్ల తాగేవాళ్లు తగ్గలేదని, కల్తీ, నాసిరకం, నాటు సారా తాగి చనిపోయే వాళ్ల సంఖ్య పెరిగిందని అన్నారు. కమిషన్ల కోసమే వైన్ షాప్స్ లో ఆన్లైన్ చెల్లింపులు పెట్టడం లేదని ఆరోపించారు.

టీడీపీ లేకుంటే చనిపోయిన కుటుంబాలవైపు ప్రభుత్వం చూసేది కాదని, వైసీపీ నేతల అవినీతి అనకొండ అంతటి అవినీతి అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున పార్టీ నుంచి ఆర్థికసాయం అందించనుందని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వివాఖ ఎల్జీ పాలిమర్స్ తప్పు వల్ల జనం చనిపోతే ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని, ఇవి కూడా ప్రభుత్వం చేసిన హత్యలేనని, కాబట్టి పరిహారం ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందిస్తామన్నారు.

This post was last modified on March 15, 2022 9:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

49 minutes ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

2 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

2 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago