Political News

అధికారంలోకి వ‌స్తే.. ప‌వ‌న్ సంచ‌ల‌న హామీలు

జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్‌.. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేదిక‌గా.. ప్ర‌జ‌ల‌కు సంచ‌ల‌న హామీలు ఇచ్చారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చే దిశగా అడుగులు వేస్తున్నామ‌న్నారు. పార్టీని పుంజుకునేలా చేస్తామ‌న్నారు. తాము అధికారంలోకి రాగానే స‌మూల మార్పుల దిశ‌గా.. శ్రీకారం చుడ‌తామ‌ని తెలిపారు. క‌ర్నూలు జిల్లా పేరును మార్చి.. ద‌ళిత పితామ‌హుడు దామోద‌రం సంజీవ‌య్య పేరును పెడ‌తామ‌న్నారు.

అదేవిధంగా ఉద్యోగులు ఎప్ప‌టి నుంచో ఎద‌రు చూస్తున్న సీపీఎస్‌(కంట్రి బ్యూట‌రీ పింఛ‌న్‌ను)ను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. పాత పింఛ‌ను విధానాన్ని పున‌రుద్ధ‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. అప్పులు లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాకార‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ప‌వ‌న్ చెప్పారు. వైసీపీ నేత‌లు ఒళ్లు పొగ‌రెక్కి.. అధికార గ‌ర్వంతో మాట్లాడు తున్నార‌ని విరుచుకుప‌డ్డారు.  ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఇచ్చిన హామీలు.. అధికారంలోకి రాగానే మ‌ర్చిపోయార‌ని అన్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు వేసుకునేందుకు మూడున్న‌ర కోట్ల రూపాయ‌ల‌ను వృథా చేశార‌ని చెప్పారు.

ఒక కులాన్ని వ‌ర్గ శ‌త్రువుగా ఎలా చూస్తార‌ని.. సీఎం జ‌గ‌న్‌ను ప‌వ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. తాను కులాల‌ను ప్రేమిస్తాన‌ని.. అన్ని కులాలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటాన‌ని..ప‌వ‌న్ చెప్పారు. జ‌న‌సైనికులు కొద‌మ సింహాల మాదిరిగా గ‌ర్జించాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. స‌భ‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ.. ఒక్కొక్క కొద‌మ సింహ‌మ‌ని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వ‌స్తే.. అల్పాదాయ వ‌ర్గాల‌కు ఉచితంగా ఇసుక‌ను ఇస్తామ‌ని.. ప‌వ‌న్ సంచ‌ల‌న హామీ ఇచ్చారు.అ దేస‌మ‌యంలో.. ప్ర‌తి ఏటా 5 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేసి.. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌ను పార‌ద్రోలుతామ‌న్నారు.  వైసీపీ వ్య‌తిరేక ఓటును ఏకం చేస్తామ‌ని..వ చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి పుట్ట‌గ‌తులు లేకుండా చేస్తామ‌ని.. ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం తీసుకువ‌స్తామ‌ని.. ప‌వ‌న్ చెప్పారు. అదేవిధంగా తాము అధికారంలోకి రాగానే.. ఉద్యోగుల పీఆర్సీలో స‌మూల మార్పులు తెచ్చి.. వారిని సంతోష పెడ‌తామ‌న్నారు.

This post was last modified on March 15, 2022 12:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

48 minutes ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

2 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

2 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago