టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రేగిన వివాదం ముగిసినట్లేనా? కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని మధ్య నెలకొన్న విభేదాలు సమస్య పోయినట్లేనా..? ఈ ప్రశ్నలకు స్వయంగా ఎమ్మెల్యే కొలికపూడి సమాధానం చెప్పారు. తిరువూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ వివాదాలు ముగిసినట్లేనని ఆయన తెలిపారు.
అసెంబ్లీ లాబీలో ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అల్లా శ్రీనివాసరావును కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఎంపీ కేశినేని చిన్నితో తలెత్తిన వివాదంపై చర్చించినట్లు వెల్లడించారు.
తన చర్యలు పార్టీకి ఇబ్బందులు కలిగించి ఉంటే చింతిస్తున్నానని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని కొలికపూడి పేర్కొన్నారు. ఇకపై ఏ సమస్య ఉన్నా జోనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
తన నియోజకవర్గంలో ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తప్పకుండా ఇస్తానని, అదే సమయంలో ఆయన నుంచి కూడా అదే గౌరవం ఆశిస్తున్నానని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులం కార్డు వాడటం తన అభిమతం కాదని స్పష్టం చేశారు. ఇటీవల తిరువూరులో జరిగిన పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు ఇబ్బందులు కలిగించి ఉంటే తనకు విచారం ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
ఇదివరకు ఎమ్మెల్యే కొలికపూడి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు తీసుకున్నారని ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన అకౌంట్ నుంచి ఎవరికెంత డబ్బు బదిలీ చేశారో ఆధారాలతో వెల్లడిస్తానని కూడా పేర్కొన్నారు.
తాజాగా తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా కొలికపూడి ఆరోపించారు. నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కళ్యాణోత్సవం సందర్భంగా తనపై దాడి చేసేందుకు కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయం నుంచే జనాన్ని సమీకరించారని ఆరోపించారు. ఈ పరిణామాలపై స్పందించిన అధిష్టానం పార్టీ నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని పేర్కొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రస్తుతం వివాదం ముగిసినట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే కొలికపూడి మాటలు నమ్మశక్యంగా లేవని, ఇలా చెబుతూనే పదే పదే తప్పులు తిరిగి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారైనా కొలికపూడి ఆయన మాటలకు కట్టుబడి ఉంటారా లేదా అనేది వేచి చూడాలి.
This post was last modified on March 6, 2026 6:56 pm
ఒకప్పుడు ఫాంటసీ బ్యాక్ డ్రాప్ సినిమాలు అరుదుగా వచ్చేవి. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి మధ్య ఎందుకు అంత గ్యాప్ వచ్చిందంటే…
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సుమారు 4 వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టు ఈ కేసును…
దురంధర్ 2 రివెంజ్ ఏమైనా వాయిదా పడుతుందేమో, సోలో రిలీజ్ ఎంజాయ్ చేయొచ్చని భావించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉదయం…
ప్రముఖ ఎన్నారై నాయకుడు, టీడీపీ ఎన్నారై విభాగాల సమన్వయ కర్తగా ఉన్న కోమటి జయరాంకు.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో తెరకెక్కబోయే సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తారనే వార్తలు మొన్నటి దాకా చక్కర్లు…
తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తరఫున ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఎంపీగా ఉన్న జాతీయ…