తాజాగా విశాఖ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోరు పెంచిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేసిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ.. మరోసారి స్పీకర్ తమ్మినేనికి గంటా లేఖ రాశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశానని, అయితే ఏడాది దాటినా తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఆవేదన చెందుతున్నానని లేఖలో గంటా పేర్కొన్నారు. ఏడాదికాలంగా కార్మికుల పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని, స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమని అన్నారు.
అయితే, స్పీకర్ మాత్రం గంటా రాజీనామాను అమోదించలేదు. వాస్తవానికి ఈ తరహా రాజీనామాలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఏడాదిగా గంటా రాజీనామాను పెండింగ్ లో పెట్టడం వెనుక వేరేకారణాలున్నాయని తెలుస్తోంది. గంటా రాజీనామా ఆమోదించి.. 6 నెలల్లో ఉపఎన్నికలు వస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరమని తమ్మినేని అనుకుంటున్నారట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జగన్ సర్కార్ కు డ్యామేజీ ఎక్కువగా అయిందని, అందుకే గంటా రాజీనామాపై మీనమేషాలు లెక్కిస్తున్నారని టాక్ వస్తోంది. మరోవైపు, గంటా రాజీనామా వెనుక అసలు ఉద్దేశ్యం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విశాఖ ఉద్యమాన్ని సాకుగా చూపి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకే గంటా స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా గంటా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన సమయంలో హఠాత్తుగా యాక్టివ్ కావడం కూడా ఆ అనుమానాలకు ఊతమిస్తోంది. నిజంగా విశాఖ ఉక్కే గంటా ఎజెండా అయితే…విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేతల పోరులో గంటా ఏనాడూ పాల్గొనలేదు. అంతేకాదు, ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్ర నేతల భేటీకీ గంటా డుమ్మా కొట్టారు. చాలాకాలంగా సైలెంట్ గా ఉంటున్న గంటా… ఇపుడు హఠాత్తుగా మరోసారి తన రాజీనామా సంగతి ఏమిటని స్పీకర్ కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
This post was last modified on March 14, 2022 8:05 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…