జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పుచేశారు. తాను ముఖ్యమంత్రి కావటానికి కారణమైన పార్టీనే జగన్ పట్టించుకోలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్రంలోని చాల చోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు వేడుకలను ఘనంగానే నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగానే తాడేపల్లిలోని సెంట్రల్ ఆఫీసులో కూడా వేడుకలు జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. పార్టీ జెండాను ఎగరేయటమే కాకుండా నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయిన జగన్ మాత్రం ఎక్కడా కనబడలేదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మించిన ముఖ్యమైన కార్యక్రమం జగన్ కు ఏముంటుంది ? ఈరోజు ముఖ్యమంత్రి సీటులో కూర్చోవటానికి కారణమైన పార్టీనే జగన్ పట్టించుకోకపోతే ఎలాగ ?
శనివారం ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాల్లో జగన్ బిజీగా ఉన్నారా అంటే అదీలేదు. తాడేపల్లిలోనే ఉన్న క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఒక అర్ధగంట కూడా జగన్ పార్టీ వేడుకలకు కేటాయించలేకపోయారా ? ఇదే విషయమై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా సరే ఎంతబిజీలో ఉన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మాత్రం వదులుకోరు. కానీ జగన్ మాత్రం ఎక్కడా అడ్రస్ లేరు.
రాబోయేదంతా ఎన్నికల కాలమే. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ బాగా పెరిగిపోతోంది. ఇటు చంద్రబాబునాయుడు అటు పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీ కార్యక్రమాల్లోనే బిజీగా గడుపుతున్నారు. మధ్య మధ్యలో పవన్ సినిమాల్లో బిజీగా ఉంటున్నా ఏమాత్రం ఖాళీ దొరికినా పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు. ఇదంతా చూస్తు కూడా జగన్ ఆవిర్భావ దినోత్సవానికి కూడా రాకపోవటమే విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రిగా ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. కానీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా వదిలేయటం బావోలేదు.
This post was last modified on March 13, 2022 10:34 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…