Political News

రాష్ట్రపతి రేసులో తెలుగోడు !!

మరో నాలుగు నెలల్లో ఖాళీ కానున్న రాష్ట్రపతి పదవిపై దేశంలోని అనేక మంది సీనియర్ నేతలు, రాజనీతిజ్ఞులు ఆశపడుతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం 2022 జులైతో పూర్తి కానుంది. రెండోసారి ఆయనకు రాష్ట్రపతి పదవి వరించ అవకాశం ఉండకపోవచ్చు. బాబూ రాజేంద్ర ప్రసాద్ మినహా ఇప్పటి వరకు ఎవరూ రెండు సార్లు రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. ప్రస్తుత రాష్ట్రపతికీ అలాంటి అవకాశం లేకపోవచ్చన్నదే అంతటా వినిపిస్తున్న మాట.

అలాంటప్పుడు కోవింద్ స్థానంలో వచ్చేది ఎవరనే చర్చ దిల్లీలో మొదలైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి పదవి దక్కొచ్చన్న వాదన ఒకటి ఉన్నప్పటికీ అది బలంగా వినిపించడం లేదు. వెంకయ్యనాయుడికి అవకాశం దక్కకపోయినా దక్షిణాదికి చెందిన నేత ఈసారి రాష్ట్రపతి కావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అబ్దుల్ కలామ్ తరువాత దక్షిణ భారతీయులు ఎవరికీ ఈ పదవి దక్కలేదు.

పైగా దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ రాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా సౌత్ ఇండియా ప్రజలను ఊరడించే ఆలోచనలోనూ ఉంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తెలంగాణపై గురిపెట్టిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఈసారి రాష్ట్రపతి ఎన్నిక కావొచ్చన్న అంచనాలు భారీగా వినిపిస్తున్నాయి. తెలంగాణకు చెందిన వెనుకబడిన వర్గాల నేత ఒకరు రాష్ట్రపతి రేసులో ముందున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం హర్యానా గవర్నర్‌గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయ పేరు పరిశీలనకురానున్నట్లు ఢిల్లీ అధి కార లాబీల్లో వినవస్తోంది. దత్తాత్రేయకు అవకాశం కల్పిం చడం ద్వారా వివాద రహితుడికి అత్యున్నత పదవిని ఇచ్చిన ట్లవుతుందన్న విశ్లేషణతోపాటు, దక్షిణాది సీనియర్‌ నేతకు సముచిత గౌరవం కల్పించినన్నట్లవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు దత్తాత్రేయ సామాజిక వర్గం కర్ణాటక, ఏపీలోని రాయలసీమలోనూ ఎక్కువగా ఉన్నందున ఆయన పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో అక్కడ కురుమలను ఆకర్షించేందుకు కూడా దత్తాత్రేయ అయితే కరెక్టన్న భావన వినిపిస్తోంది. దత్తాత్రేయ అభ్యర్థిత్వంపై బీజేపీలోనూ ఎవరి నుంచీ అభ్యంతరాలు ఉండకపోవచ్చని.. అటు తెలంగాణలోనూ పార్టీలకు అతీతంగా ఆయనకు ఆమోదం దొరుకుతుందని భావిస్తున్నారు.

దత్తాత్రేయ ఆది నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌, జన్ సంఘ్‌, అనంతరం బీజేపీతోనే సాగుతున్నారు. నిరాడంబరుడు, వివాదరహితుడిగా పేరుంది. మోదీ మొదటి మంత్రివర్గంలో కొన్నాళ్లపాటు కార్మిక శాఖ చూసిన దత్తాత్రేయను ఆ తరువాత పదవి నుంచి తప్పించడంతో ఆయన్ను పక్కనపెట్టినట్లుగా భావించారు. కానీ, ఆ తరువాత దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పంపించారు. అనంతరం కీలకమైన హర్యాణా గవర్నరుగానూ నియమించారు. దీంతో దత్తాత్రేయ ప్రాధాన్యం తగ్గలేదని, మోదీకి ఆయనపై మంచి అభిప్రాయమే ఉందని నిరూపణైంది. దీంతో రాష్ట్రపతి పదవికి ఆయన పేరుపై అభ్యంతరం ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. దేశ అత్యున్నత పదవిని కనుక దత్తాత్రేయ అధిరోహిస్తే ఆ పదవి అందుకున్న మూడో తెలుగువాడిగా, నీలం సంజీవరెడ్డి తరువాత సుదీర్ఘకాలానికి మళ్లీ రాష్ట్రపతి అయినవారిగా దత్తాత్రేయ చరిత్రకెక్కనున్నారు.

This post was last modified on March 12, 2022 8:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజుల ఊపిరి

తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…

35 minutes ago

వారణాసి ఇప్పుడెందుకు గుర్తుకు వస్తోంది

రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…

51 minutes ago

శుభసూచకం… ప్రిమియర్లు ఫుల్

వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్‌కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…

2 hours ago

జగన్ మావిగన్… ఇప్పుడు సినిమా అయిపోయింది

మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…

2 hours ago

తండ్రి బాటలోనే పేర్ని కిట్టు

అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…

2 hours ago

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

6 hours ago