తాజాగా వెలువడుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన బీజేపీ గోవాలో ప్రత్యర్థి పార్టీలకు గట్టిపోటీనిస్తోంది. ఇక, పంజాబ్ లో ఆప్ అన్ని పార్టీలను ఊడ్చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదిశగా అడుగులు వేస్తోంది. ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకునే దిశగా పయనిస్తోంది.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. కడపటి వార్తలు అందేసరికి ఆప్ 88 స్థానాల్లో దూసుకుపోతోంది. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే. పంజాబ్ లో సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ ల మధ్య కోల్డ్ వార్ తో కాంగ్రెస్ 12 స్థానాలకు సరిపెట్టుకుంది. ఇక, కాంగ్రెస్ తో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్న కెప్టెన్ పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధూ రాజీనామా చేశారు. పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ దాదాపు 55వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఇక, యూపీలో బీజేపీ 264 స్థానాలలో లీడింగ్ లో ఉండగా…ఎస్పీ 124 స్థానాలలో లీడింగ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లో బీజేపీ 41, కాంగ్రెస్ 25 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. గోవాలో మరోసారి రిసార్ట్ రాజకీయాలు తప్పేలా లేవు. గోవాలో బీజేపీ 19, కాంగ్రెస్ 14, ఆప్ 2, ఇతరులు 7 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. మణిపూర్ లో బీజేపీ 23 స్థానాలలో లీడింగ్ లో ఉంటూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. మణిపూర్ లో కాంగ్రెస్ 13, ఎన్పీపీ 11 స్థానాలకు పరిమితమయ్యాయి.
యూపీలో టీవీల్లో వస్తున్న కథనాలు, ట్రెండ్స్ చూసి సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఎస్పీ అధినేత అఖిలేష్ అన్నారు. వంద స్థానాల్లో ఓట్ల తేడా కేవలం 500 మాత్రమే ఉందని, పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు, నేతలంతా కౌంటింగ్ బూత్ ల వద్దే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
This post was last modified on March 10, 2022 8:17 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…