నాలుగు రాష్ట్రాల్లో విజయం కారణంగా తెలంగాణాలో బీజేపీ నేతలు కేసీయార్ పై రెచ్చిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది తామేనంటు నానా రచ్చ మొదలుపెట్టేశారు. ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం వేరు తెలంగాణాలో గెలవటం వేరన్న విషయాన్ని కమలనాదులు మరచిపోయారు. పైగా ఇప్పటికే కేసీయార్ పై బీజేపీ నేతలు రెచ్చిపోతు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు.
ఇలాంటి నేపధ్యంలో నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆగుతారా ? జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పాలని, నరేంద్రమోడికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని కలలుకంటున్న కేసీయార్ కు చుక్కలు చూపిస్తామంటు బీజేపీ నేతలు అప్పుడే వార్నింగులిచ్చేస్తున్నారు. నిజానికి తెలంగాణాలో అధికారంలోకి వచ్చేసేంత సీన్ కమలనాదులకు లేదు. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో సంస్ధాగతంగా పార్టీకి అసలు బలమే లేదు. కాకపోతే జనాలు ప్రత్యామ్నాయం కోసం చూసినపుడు పార్టీకి సంస్ధాగతంగా బలముందా లేదా అన్నది చూడరు.
దీనికి ఉదాహరణ 2019 ఎన్నికల్లో బీజేపీ నాలుగు లోక్ సభ సీట్లలో గెలవటమే. కేసీయార్ కూడా తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుని డైరెక్టుగా మోడీపైనే రెచ్చిపోతున్నారు. మోడికి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో వేదికను ఏర్పాటు చేస్తానని పదే పదే చెప్పి నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులను వరుసగా కలుస్తున్నారు. అయితే వారిలో ఎందరినుండి మద్దతొచ్చిందనే విషయంలో క్లారిటిలేదు.
ఇప్పటికైతే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నుండి మాత్రమే కేసీయార్ కు మద్దతొచ్చిందట. ఇంతోటిదానికే మోడికి వ్యతిరేకంగా కేసీయార్ రెచ్చిపోతున్నారు. ఈ నేపధ్యంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు కచ్చితంగా కేసీయార్ ఆశలపై నీళ్ళు చల్లేవే. ఇందుకనే బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో కచ్చితంగా అధికారంలోకి వచ్చేయటం ఖాయమంటు రచ్చ మొదలుపెట్టేశారు. ఇప్పటికే రోజుకో సమస్యను తీసుకుని కేసీయార్ ను ఊపిరి ఆడనీయటంలేదు. కాబట్టి ఆ ఎన్నికలేదో తొందరగా వచ్చేస్తే బాగుండి గోల తగ్గుతుంది.
This post was last modified on March 10, 2022 7:10 pm
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…