తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు సినిమాల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. తెలుగు చిత్రాల్లో తెలంగాణ యాస వాడుక గురించి ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను హాస్యాస్పదంగా చూపించేవారని.. విలన్ పాత్రలకు, కమెడియన్లకు తెలంగాణ స్లాంగ్ వాడేవారని.. కానీ ఇప్పుడు హీరోలకు ఈ స్లాంగ్ పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
కేసీఆర్ చెప్పిన మాట వాస్తవమే. తెలుగు సినిమాల్లో ఈ మార్పు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. 2000కు ముందు అయితే తెలుగు చిత్రాల్లో తెలంగాణ యాసకు అసలు ప్రాధాన్యమే ఉండేది కాదు. విలన్లు, కమెడియన్లకే ఈ యాసను వాడేవారు. ఐతే ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం మొదలయ్యాక క్రమంగా మార్పు రావడం మొదలైంది. హీరోలు తెలంగాణ యాస మాట్లాడ్డం లాంటి మార్పేమీ కనిపించలేదు కానీ.. ఆ యాసను తక్కువ చేసేలా పాత్రలు, డైలాగ్స్ పెట్టడం తగ్గిపోయింది.
ఇక 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వేగంగా పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పట్లా తెలంగాణ నేపథ్యంలో కన్నీటి చిత్రాలు, ఉద్యమ సినిమాలు కాకుండా ఇక్కడి నేపథ్యంలో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, ఎంటర్టైనర్లు రావడం మొదలైంది. ముఖ్యంగా పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి అర్బన్ బేస్డ్ సినిమాలతో తెలంగాణ యాసను చూసే కోణమే మారిపోయింది.
విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి నటులు.. సందీప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు ‘తెలంగాణ’ సినిమా కలరే మార్చేశారు. క్రమంగా తెలంగాణ అర్బన్ బేస్డ్ సినిమాలకు ఆదరణ పెరిగింది. ఇటీవలి కాలంలో సిద్ధు జొన్నలగడ్డ కూడా తెలంగాణ యాసకు పాపులారిటీ తెచ్చాడు. తాజాగా అతడి సినిమా ‘డీజే టిల్లు’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈ సినిమాలో కూడా తెలంగాణ యాసను చాలా అందంగా వాడుకున్నారు. డైలాగ్స్కు అదే ప్లస్ అయింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ వ్యాఖ్య చేసినట్లున్నారు
This post was last modified on March 9, 2022 6:29 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…