ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో అతి పెద్ద రాష్ట్రం, బీజేపీ నేతలు అత్యంత కీలకంగా తీసుకున్న రాష్ట్రం యూపీలో ఓటర్లు మళ్లీ బీజేపీకే అధికారాన్ని కట్టబెట్టనున్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఏడో విడత పోలింగ్తో.. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
అంతకుముందే.. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ విశ్లేషిస్తూ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదోనని చెప్పేస్తాయి. సర్వేల ద్వారా ఓటర్ల నాడిని పసిగడతాయి. తాజాగా ఈ ఫలితాలు వెలువడ్డాయి. యూపీ విషయానికి వస్తే.. అన్ని ఎగ్జిట్పోల్ సర్వేలు.. కూడా బీజేపీకే ఇక్కడి ప్రజలు పట్టగడతాయని తేల్చశాయి. కాంగ్రెస్ మరింత బలహీన పడినట్టు ఈ ఫలితాల ద్వారా వెల్లడైంది.
యూపీలో.. మొత్తం స్థానాలు 403
పోల్ స్ట్రాట్ సర్వే.. ఏం చెప్పిందంటే..
బీజేపీ + 211-225
సమాజ్వాదీ+ 146-160
బీఎస్పీ 14-24 కాంగ్రెస్ 4-6
సీఎన్ఎన్ న్యూస్ 18
బీజేపీ + 240
సమాజ్వాదీ+ 140
బీఎస్పీ 17
కాంగ్రెస్ -ఇతరులు 6
ఆత్మసాక్షి ఎగ్జిట్పోల్
బీజేపీ+ 138-140
సమాజ్వాదీ+ 235-240
బీఎస్పీ 19-23
కాంగ్రెస్ 12-16
ఇతరులు 1-2
పీ-మార్క్
బీజేపీ + 225-255
సమాజ్వాదీ+ 130-150
బీఎస్పీ 12-22కాంగ్రెస్ 2-6
ఇతరులు 0-4
మ్యాట్రిజ్ ఎగ్జిట్పోల్
బీజేపీ + 262-277
సమాజ్వాదీ+ 119-134
బీఎస్పీ 7-15
కాంగ్రెస్ 3-8
ఇతరులు 0
This post was last modified on March 7, 2022 11:29 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…