ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సభ రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి గవర్నర్ హరిచందన్ వత్తాసు పలుకుతున్నారని, గో బ్యాక్ గవర్నర్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ తర్వాత ప్రభుత్వ తీరుపై, గవర్నర్ వ్యవహార శైలిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వ్యవస్థలపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదని, గవర్నర్ పేరును వాడుకొని ప్రభుత్వం అప్పులు తెచ్చినా పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అవాస్తవాలేనని, అందుకే సభ నుంచి వాకౌట్ చేశామని వెల్లడించారు. వైసీపీ సర్కారు తీరుపైనా అచ్చెన్న మండిపడ్డారు.
అమరావతే ఏపీ రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టిన బొత్స మూడు రాజధానులకే కట్టుబడి ఉంటామని ప్రకటించడాన్ని అచ్చెన్న దుయ్యబట్టారు. 2024 వరకు తెలంగాణ, ఏపీలకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని అని బొత్స అన్నారని, అటువంటపుడు జగన్ హైదరాబాద్ నుంచే పాలించాలని తనదైన శైలిలో చురకలంటించారు. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు మాత్రం రాష్ట్రం నుంచి పాలించాలని అమరావతికి వచ్చారని స్పష్టం చేశారు.
అంతకుముందు జరిగిన బీఏసీ సమావేశంలో తనపై జగన్ చేసిన వ్యాఖ్యలకు అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ వయసును గౌరవించకుండా అవమానించడం సరికాదని జగన్ అన్నారని, తాము గవర్నర్ తప్పిదాలనే ఎండగట్టామని క్లారిటీ ఇచ్చారు. ఆమాటకొస్తే టీడీపీ అధినేత చంద్రబాబు పెద్దాయన కాదా..? అంత వయసున్న చంద్రబాబును సభలో జగన్ అవమానించ లేదా..? అని అచ్చెన్న నిలదీశారు. మరి, అచ్చెన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on March 7, 2022 11:09 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…