Political News

బీజేపీ నేత‌కు కేసీఆర్ రాజ్య‌స‌భ సీటు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ  స‌ర్కారుపై స‌మ‌రశంఖం పూరించారు. బీజేపీ ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాని మోడీని తీవ్రంగా విమ‌ర్శిస్తున్న ఆయ‌న జాతీయ రాజ‌కీయాలపై పూర్తి దృష్టి సారించారు. దేశంలోని  బీజేపీ  వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఒక్క‌టి చేసేందుకు దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కీల‌క నేత‌ల‌ను ఆయ‌న క‌లిశారు. బీజేపీ అంటేనే చాలు అగ్గి మీద గుగ్గిలంలా మండిప‌డుతున్న ఆయ‌న‌.. ఓ బీజేపీ నేత‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తారనే ప్ర‌చారం ఆస‌క్తి రేపుతోంది.

బీజేపీపై పోరాటానికి వివిధ పార్టీల మ‌ద్ద‌తు కోసం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఆయ‌న తాజాగా బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నేత రాకేష్ టికాయిత్‌తో ఢిల్లీలో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బీజేపీపై పోరు బావుటా ఎగ‌రేసిన కేసీఆర్‌తో బీజేపీ రాజ్య‌స‌భ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్యం స‌మావేశ‌మ‌వ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే గ‌త కొద్దికాలంగా ప్ర‌ధాని మోడీ, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కేసీఆర్‌తో భేటీ కావ‌డం ఆస్త‌కి రేపుతోంది.

త‌మిళ‌నాడుకు చెందిన సుబ్ర‌హ్మ‌ణ్యం 2016లో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగుస్తుంది. ఈ స‌మ‌యంలో కేసీఆర్‌తో ఆయ‌న భేటీ కావ‌డంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజ‌కీయాల‌పై క‌న్నేసిన కేసీఆర్‌.. అక్క‌డ త‌న‌కు న‌మ్మ‌కంగా ఉండేవాళ్ల‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతారనే ప్ర‌చారం సాగుతోంది. ఆ నేప‌థ్యంలోనే సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని కూడా రాజ్య‌స‌భ‌కు పంపుతారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై కేసీఆర్‌తో చ‌ర్చించాన‌ని, త‌న‌కు అన్ని పార్టీల్లోనూ స్నేహితులున్నార‌ని సుబ్ర‌హ్మ‌ణ్యం అంటున్నారు. కానీ ఈ భేటీ వెన‌క ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఈ ఏడాది జూన్‌తో తెలంగాణ‌కు చెందిన ముగ్గురు రాజ్య‌స‌భ సభ్యుల స్థానం ఖాళీ అవుతుంది. వాటి అభ్య‌ర్థుల విష‌యంపై కేసీఆర్ ఇంకా క‌స‌ర‌త్తులు మొద‌లెట్ట‌లేదు. కానీ వాటిలో ఒక స్థానంలో న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. జాతీయ రాజ‌కీయాల్లో త‌న త‌ర‌పున ప్ర‌కాష్‌ను ఉప‌యోగించుకోవాల‌ని కేసీఆర్ చూస్తున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ను కేసీఆర్ క‌లిసిన స‌మ‌యంలో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఇప్పుడు సుబ్ర‌హ్మ‌ణ్యం కూడా రాజ్య‌స‌భ రేసులో ఉన్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

This post was last modified on March 4, 2022 4:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

1 hour ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago