Political News

గవర్నర్ కు కేసీయార్ కు మధ్య ఏం జరుగుతోంది?

వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లకు ముఖ్యమంత్రులకు మధ్య ఏమాత్రం పడటంలేదు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలే నిదర్శనం. ఈ జాబితాలోకి తెలంగాణా కూడా చేరుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మార్చి 7వ తేదీనుండి మొదలవ్వబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం తేల్చేసింది. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో మొదలవ్వటం ఆనవాయితి.

కానీ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనావాయితీని పాటించాల్సిన అవసరం లేదని కేసీయార్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈమధ్య గవర్నర్ కు కేసీయార్ మధ్య గ్యాప్ మొదలైన విషయం అందరికీ అర్ధమవుతోంది. మొన్నటికి మొన్న వరంగల్ జిల్లా మేడారంలో సమ్మక్క-సారక్క జాతర జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. జాతర ముగింపు రోజున గవర్నర్ మేడారం వెళ్ళారు. అయితే అక్కడ గవర్నర్ కు మంత్రులు కానీ జిల్లా అధికారులు కానీ స్వాగతం పలకలేదు.

మేడారం జాతర ముగిపు ఉత్సవాలకు గవర్నర్ హాజరయ్యే ముందువరకు కూడా మంత్రులు, కలెక్టర్, ఎస్పీలు అక్కడే ఉన్నారు. ఇక కొద్ది నిముషాల్లో గవర్నర్ అక్కడికి చేరుకుంటున్నారు అని తెలియగానే మంత్రులు, కలెక్టర్, ఎస్పీలు మాయమైపోయారు. మంత్రులంటే గవర్నర్ ను రిసీవ్ చేసుకోకపోయినా వాళ్ళకొచ్చే నష్టం ఏమీలేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయనేతలు కాబట్టి గవర్నర్ వెంటనే వాళ్ళని చేయగలిగేది ఏమీలేదు.

కానీ కలెక్టర్, ఎస్పీ పరిస్దితి అదికాదు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ వస్తుంటే కలెక్టర్, ఎస్పీలు రిసీవ్ చేసుకుని తీరాలి. గవర్నర్ పర్యటన మొదలై ముగిసి వెళిపోయేంతవరకు కలెక్టర్, ఎస్సీ గవర్నర్ తోనే ఉండాలి. మరి ప్రోటోకాల్ ను కూడా ఉల్లంఘించి కలెక్టర్, ఎస్పీ వెళిపోయారంటే అర్ధమేంటి ? ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాలు లేకుండా ఇది జరగదు కదా. ఇందుకే గవర్నర్-కేసీయార్ మధ్య కూడా గ్యాప్ మొదలైపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on March 1, 2022 1:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

6 minutes ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

31 minutes ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

57 minutes ago

ఇళయరాజా పోరాటం… వేరొకరికి ఆదాయం

తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…

2 hours ago

దొంగకే దెబ్బ… ChatGPTతో చుక్కలు చూపించిన కుర్రాడు

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…

2 hours ago

సాయిపల్లవి నిర్ణయాలు అందుకే ఆలస్యం

గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…

2 hours ago