ఏపీ స‌ర్కారుపై మెగా బ్ర‌ద‌ర్ ఫైర్‌

ఏపీ ప్ర‌భుత్వంపైనా.. మంత్రికొడాలి నానిపైనా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫైర‌య్యారు. సినిమా పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం సంకుచిత ధోరణితో ప్రవర్తిస్తోందని తెలిపారు. పవన్‌కల్యాణపై కక్ష సాధించ డం కోసమే ‘భీమ్లానాయక్‌’ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించిన జీవో రిలీజ్‌ చేయలేదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దమ్ముందా మీకు’ అంటూ  ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిం చారు. ఇకనైనా.. మంచి పాలన చేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు.

“గత కొద్దికాలంగా సినిమా టికెట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం, మంత్రులు విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. సినిమా పరిశ్రమలోని కార్యకలాపాలపై వాళ్లకు ఎలాంటి అవగాహన లేదు. కాబట్టి వాళ్లని నేను ఏం అనలేను. సామాన్యుడికీ సినిమా టికెట్‌ ధరలు అందుబాటులోకి రావాలని మీరు అంటున్నారు. దాన్ని నేనూ అంగీకరిస్తా. కానీ, మన సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే దాన్ని తెరకెక్కించడంలో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది“ అని నాగ‌బాబు వ్యాఖ్యానించారు.

“నటీనటుల పారితోషికాలు సినిమాకి పెట్టిన ఖర్చులో భాగం కాదని మీరు అంటున్నారు. సినిమాకి పెట్టే మొత్తం ఖర్చులో కేవలం 12 నుంచి 20శాతం మాత్రమే హీరోలకు పారితోషికంగా ఇస్తాం. ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. సినిమా కనుక పరాజయం పొందితే హీరోలు పారితోషికాన్ని తగ్గించుకుం టారు. కొన్నిసార్లు వెనక్కి ఇచ్చేస్తారు. మా అన్నయ్య, పవన్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌, ప్రభాస్‌.. ఇలా ఎంతోమంది హీరోలు.. తమ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడనప్పుడు నిర్మాతకు బాసటగా ఉండటానికి పారితోషికాన్ని తగ్గించుకున్నవారే.“ అని మెగా బ్ర‌ద‌ర్ వివ‌రించారు.  

రాజ‌కీయ వ్యక్తిగత అజెండాల కారణంగా పవన్‌ని అణగదొక్కేయాలనో, లేదా సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనో ప్లాన్‌ చేస్తున్నారు. దాని కోసమే మీరు పరిశ్రమపై పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యాపారాన్నైనా మీ చేతుల్లోకే తీసుకుంటున్నారు కదా.. అలాగే సినిమా పరిశ్రమని సైతం ఆంధ్రా వరకూ మీరే తీసుకోండి. వెల్లంపల్లి, కొడాలి వంటి వారిని హీరోలుగా పెట్టి సినిమాలు చేయండి. వాళ్లు బాగా నటిస్తారు. ఆ నటన ముందు మేము ఏ మాత్రం సరిపోం. లేదంటే ఆంధ్రాలో తెలుగు సినిమాలు బ్యాన్‌ చేసేయండి. కొన్నిరోజులు నష్టపోతాం. వేరే దారి చూసుకుని మా సినిమాలు విడుదల చేస్తాం. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. యూట్యూబ్‌, ఓటీటీ ఎలా చూసుకున్న మాకు డబ్బులు వస్తాయి’’ అని నాగ బాబు ఫైర‌య్యారు. మ‌రి దీనికి వైసీపీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.