మునెపెన్నడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు చెందిన భీమ్లానాయక్ సినిమా ఫ్యాన్స్ తో పాటుగా రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వగా ఏపీలో ఈ మేరకు వెసులుబాటు దక్కలేదు. అయితే, తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు.
దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఫ్లెక్సీకి వైఎస్ జగన్ సర్కారు షాక్ ఇచ్చింది. కేసీఆర్ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సర్ అంటూ పవన్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రపాటలతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఫ్లెక్సీ ఏర్పాటు కేవలం విజయవాడలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. సహజంగానే దీనికి రాజకీయాలు ముడిపెట్టి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రస్తావిస్తూ ఇరుకున పడేశారు. ఈ నేపథ్యంలో అధికారులు రియాక్టయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు.
విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీతో పాటుగా ఇతర ప్రాంతాల్లోని ఫ్లెక్సీలను సైతం తొలగించారు. కాగా, పవన్ ఫ్లెక్సీల తొలగింపుపై అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భీమ్లానాయక్ కు నిబంధనల విషయంలో షాకిచ్చిన ఏపీ సర్కారు ఇప్పుడు ఫ్లెక్సీల తొలగింపు రూపంలో ఫ్యాన్స్ కు సైతం షాకిచ్చారని చెప్తున్నారు.
This post was last modified on February 27, 2022 8:25 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…