టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ గ్యారెంటీ మార్కెట్ సంపాదించుకున్న డార్లింగ్ ఏకకాలంలో మూడు సినిమాలు సెట్స్ మీద పెట్టిన సంగతి తెలిసిందే. ఫౌజీ బ్యాలన్స్ ఉండగానే స్పిరిట్ మొదలైపోయింది. దీని గురించి మాట్లాడుతుండగానే కల్కి 2ని స్టార్ట్ చేశారు. ఇదంతా ఊహకందని వేగం.
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ తో ప్రశాంత్ నీల్ బిజీ ఉన్నప్పటికీ ఈ ఏడాదిలోనే సలార్ 2 శౌర్యంగపర్వం మొదలైపోతుందని ఇన్ సైడ్ టాక్. రాజా సాబ్ వైఫల్యాన్ని ప్రభాస్ లైట్ తీసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఊరట దక్కేందుకు నిర్మాత విశ్వప్రసాద్ కు మరో మూవీ హామీ ఇచ్చాడు. తనను కలుస్తున్న దర్శకులను నో అనకుండా కథలు వింటున్నాడు. ఇప్పుడీ డిస్కషన్ కు కారణం ఒక ఫోటో.
మలయాళంలో కల్ట్ కంటెంట్ గా చెప్పుకునే ఎకో, కిష్కిందకాండం దర్శకుడు దింజిత్ అయ్యతన్ ఇటీవలే ప్రభాస్ ని కలుసుకున్నాడు. ఏదైనా స్టోరీ చెప్పడానికేమోనని అభిమానులు అనుమాన పడుతున్నారు. ఇతను ఇటీవలే ధనుష్ ని కూడా కలిశాడు. ఒకవేళ నిజంగా డార్లింగ్ కాంబోలో మూవీ ఏదైనా ప్లానింగ్ ఉందేమోనని ఫ్యాన్స్ కి సందేహం కలుగుతోంది. అలాని ఎగ్జైట్ మెంట్ కూడా లేదు.
ఎందుకంటే మల్లువుడ్ దర్శకుల శైలి మన కమర్షియల్ ఫార్ములాకు సూట్ అవ్వదు. వాళ్ళ స్లో నెరేషన్, డిటైలింగ్ మన ఆడియన్స్ ఓటిటిలో చూస్తారు తప్పించి థియేటర్లలో భరించలేరు. అందుకే ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి ఒకటి రెండు తప్ప మిగిలిన మలయాళ సినిమాలేవీ తెలుగులో థియేటర్ డబ్బింగ్ కాలేదు. అలాంటప్పుడు ప్రభాస్ కు ఈ జానర్లు, బ్యాక్ డ్రాప్ లు అంతగా సెట్ కావు.
ప్రస్తుతానికి జరిగింది కేవలం కలయిక కాబట్టి ఆ ఫోటోని బట్టి కంక్లూజన్ కు రాలేం కానీ ప్రభాస్ కు కనక సదరు డైరెక్టర్ల శైలి, స్టోరీ నచ్చితే ఓకే చెప్పేందుకు వెనుకాడడు. అదే ఫ్యాన్స్ ని టెన్షన్ కు గురి చేస్తోంది. మొత్తానికి స్పీడ్ తగ్గించకుండా వరసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న ప్రభాస్ డైరీ ఇంకో మూడు సంవత్సరాల దాకా చాలా బిజీగా ఉంది. ఈలోగా ఏమేం కాంబోలు కుదురుతాయో చూడాలి.
This post was last modified on March 10, 2026 3:49 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…