టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ గ్యారెంటీ మార్కెట్ సంపాదించుకున్న డార్లింగ్ ఏకకాలంలో మూడు సినిమాలు సెట్స్ మీద పెట్టిన సంగతి తెలిసిందే. ఫౌజీ బ్యాలన్స్ ఉండగానే స్పిరిట్ మొదలైపోయింది. దీని గురించి మాట్లాడుతుండగానే కల్కి 2ని స్టార్ట్ చేశారు. ఇదంతా ఊహకందని వేగం.
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ తో ప్రశాంత్ నీల్ బిజీ ఉన్నప్పటికీ ఈ ఏడాదిలోనే సలార్ 2 శౌర్యంగపర్వం మొదలైపోతుందని ఇన్ సైడ్ టాక్. రాజా సాబ్ వైఫల్యాన్ని ప్రభాస్ లైట్ తీసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఊరట దక్కేందుకు నిర్మాత విశ్వప్రసాద్ కు మరో మూవీ హామీ ఇచ్చాడు. తనను కలుస్తున్న దర్శకులను నో అనకుండా కథలు వింటున్నాడు. ఇప్పుడీ డిస్కషన్ కు కారణం ఒక ఫోటో.
మలయాళంలో కల్ట్ కంటెంట్ గా చెప్పుకునే ఎకో, కిష్కిందకాండం దర్శకుడు దింజిత్ అయ్యతన్ ఇటీవలే ప్రభాస్ ని కలుసుకున్నాడు. ఏదైనా స్టోరీ చెప్పడానికేమోనని అభిమానులు అనుమాన పడుతున్నారు. ఇతను ఇటీవలే ధనుష్ ని కూడా కలిశాడు. ఒకవేళ నిజంగా డార్లింగ్ కాంబోలో మూవీ ఏదైనా ప్లానింగ్ ఉందేమోనని ఫ్యాన్స్ కి సందేహం కలుగుతోంది. అలాని ఎగ్జైట్ మెంట్ కూడా లేదు.
ఎందుకంటే మల్లువుడ్ దర్శకుల శైలి మన కమర్షియల్ ఫార్ములాకు సూట్ అవ్వదు. వాళ్ళ స్లో నెరేషన్, డిటైలింగ్ మన ఆడియన్స్ ఓటిటిలో చూస్తారు తప్పించి థియేటర్లలో భరించలేరు. అందుకే ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి ఒకటి రెండు తప్ప మిగిలిన మలయాళ సినిమాలేవీ తెలుగులో థియేటర్ డబ్బింగ్ కాలేదు. అలాంటప్పుడు ప్రభాస్ కు ఈ జానర్లు, బ్యాక్ డ్రాప్ లు అంతగా సెట్ కావు.
ప్రస్తుతానికి జరిగింది కేవలం కలయిక కాబట్టి ఆ ఫోటోని బట్టి కంక్లూజన్ కు రాలేం కానీ ప్రభాస్ కు కనక సదరు డైరెక్టర్ల శైలి, స్టోరీ నచ్చితే ఓకే చెప్పేందుకు వెనుకాడడు. అదే ఫ్యాన్స్ ని టెన్షన్ కు గురి చేస్తోంది. మొత్తానికి స్పీడ్ తగ్గించకుండా వరసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న ప్రభాస్ డైరీ ఇంకో మూడు సంవత్సరాల దాకా చాలా బిజీగా ఉంది. ఈలోగా ఏమేం కాంబోలు కుదురుతాయో చూడాలి.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…