Political News

జ‌గ‌న్ మాట‌కు విలువ లేదా?

టికెట్ల రేట్లు పెంచుకునే అవ‌కాశం క‌ల్పిస్తాం. త్వ‌ర‌లోనే కొత్త రేట్లు వ‌స్తాయి. ఐదో షోకు కూడా అనుమ‌తి ఇస్తాం.. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్ర‌ముఖులు త‌న‌ను క‌లిసిన‌పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నోటి నుంచి వ‌చ్చిన మాట‌లివి. ఇప్పుడున్న రేట్లతో థియేట‌ర్లు న‌డ‌ప‌డం క‌ష్ట‌మ‌న్న వాద‌న‌తో ఆయ‌న ఏకీభ‌వించారు. టికెట్ల ధ‌ర‌లు స‌వ‌రించాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించిన‌ట్లే మాట్లాడారు.

ఆయ‌న‌తో పాటు చిరు బృందంలోని వారు కూడా అతి త్వ‌ర‌లో కొత్త రేట్ల‌తో జీవో వ‌స్తుంద‌న్నారు. ఐతే జ‌గ‌న్ స్వ‌యంగా టికెట్ల రేట్లు పెంచ‌డానికి, ఐదో షో వేసుకోవ‌డానికి ఆమోదం తెలిపారు. జీవో అన్న‌ది కేవ‌లం లాంఛ‌న‌మే అని అంతా అనుకున్నారు. ఆ మీటింగ్ తర్వాత రెండు మూడు రోజుల్లోనే జీవో వ‌చ్చేస్తుంద‌ని అంతా ఆశించారు. కానీ రెండు వారాలు కావస్తున్నా జీవో ఊసే లేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా భీమ్లా నాయ‌క్ రిలీజ‌వుతున్న నేప‌థ్యంలో ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆ జీవోను ఆల‌స్యం చేస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. ఐతే స్వ‌యంగా సీఎం టికెట్ల ధ‌ర‌లు పెంచుకోవ‌డానికి, ఐదో షో వేసుకోవ‌డానికి స‌రే అంటూ ఆ స‌మావేశంలో చెప్పాక‌.. ఆ వీడియో కూడా బ‌య‌టికి వ‌చ్చాక ఇప్పుడు కేవ‌లం లాంఛ‌నం అన‌ద‌గ్గ జీవో కోసం ఎదురు చూడ్డ‌మేంటి? అంటే ముఖ్య‌మంత్రి మాట‌కు విలువ లేదన్న‌ట్లేనా? జీవో ఇంకా రాలేదు అన్న విష‌యాన్ని ప‌ట్టుకుని భీమ్లా నాయ‌క్ లాంటి పెద్ద సినిమాకు మ‌రీ క‌నీస స్థాయి రేట్ల‌తో టికెట్లు అమ్మాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డ‌మేంటి?

అస‌లు ఇప్పుడు దీన్ని మించిన స‌మ‌స్య లేద‌న్న‌ట్లుగా నిన్న‌ట్నుంచి చీఫ్ సెక్ర‌ట‌రీ స్థాయి నుంచి ఎమ్మార్వోల వ‌ర‌కు అంద‌రూ భీమ్లా నాయ‌క్ టికెట్ల ధ‌ర‌లు, షోల మీదే దృష్టిసారించ‌డం.. థియేట‌ర్ల యాజమాన్యాల‌ను పిలిపించి స‌మావేశాలు నిర్వ‌హించ‌డం.. రిలీజ్ రోజు త‌నిఖీల కోసం బృందాల‌ను సిద్ధం చేయ‌డం ఏంటో అర్థం కావ‌డం లేదు. ప‌నిగ‌ట్టుకుని ప‌వ‌న్ సినిమాకే ఇలా చేస్తే జ‌నాలు ఇది క‌క్ష‌సాధింపుగా భావించ‌కుండా ఎలా ఉంటారు?

This post was last modified on February 25, 2022 7:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago