Political News

పులివెందుల అభ్యర్ధిని ప్రకటించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీలో అనూహ్య సంఘటన జరిగింది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలుండగానే చంద్రబాబునాయుడు పులివెందుల అభ్యర్థిని ప్రకటించారు. పులివెందుల నియోజకవర్గం నేతలతో సమీక్ష జరిగింది. ఈ సమయంలోనే పార్టీ తరపున నాలుగుసార్లు పోటీచేసి, రాజీనామా చేసిన సతీష్ రెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా కొందరు ప్రస్తావించారు.

దానికి చంద్రబాబు స్పందిస్తూ పార్టీలోకి ఎవరొచ్చినా సరే రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేది బీటెక్ రవి మాత్రమే అని ప్రకటించారు. ప్రస్తుతం బీటెక్ రవి ఎంఎల్సీగా పనిచేస్తున్నారు. మరెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) ఇపుడు పులివెందులకు ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. బీటెక్ రవికి నేతలంతా ఏకతాటిపై మద్దతుగా నిలబడి బలోపేతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చెప్పారు.

పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చేసిన ఏ ప్రయత్నమూ సక్సెస్ కాలేదు. వైఎస్ కుటుంబంపై టీడీపీ తరపున సతీష్ రెడ్డే వరుసగా  నాలుగు సార్లు పోటీచేసి ఓడిపోయారు. పులివెందులలో జగన్ను ఓడిస్తామంటు ఏకంగా పులివెందులకే వెళ్ళి చంద్రబాబు రెండు మూడుసార్లు చాలెంజ్ చేసినా సాధ్యం కాలేదు.

బహుశా వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించి తీరాలన్న పట్టుదల చంద్రబాబులో పెరిగిపోయినట్లుంది. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు జగన్ పక్కా స్కెచ్ తో పావులు కదుపుతున్నారు. అందుకనే చంద్రబాబు కూడా పులివెందులకు బీటెక్ రవిని అభ్యర్ధిగా రెండున్నరేళ్ళకు ముందే ప్రకటించేసింది. పోటీ చేయటం ఖాయమని తెలిసిన నేతలను కూడా అభ్యర్ధులుగా చివరి నిముషం వరకు ప్రకటించకుండా నాన్చడం చంద్రబాబుకు బాగా అలవాటు. అలాంటిది రెండున్నరేళ్ళకు ముందే అభ్యర్ధిని ప్రకటించారంటే టీడీపీ తరపున వైఎస్ సునీత పోటీ చేస్తుందని జరిగిన ప్రచారం ఉత్త ప్రచారమనే తేలిపోయిందా ?

This post was last modified on February 23, 2022 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

3 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

4 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

5 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

5 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

6 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

6 hours ago