పెద్దగా పేరు లేని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ ఉండవచ్చు..పెద్ద పెద్ద పదవుల్లో లేని పార్టీగా కూడా ఇవాళ కాంగ్రెస్ ఉండవచ్చు గాక కానీ ఆ పార్టీని అంత సులువుగా తీసేయ్యలేం. అనుకున్నంత సులువగా ఆ పార్టీ ప్రాభవాన్నీ, వైభవాన్నీ చెరిపేయలేం. అందుకే బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగానే చూస్తోంది. పైకి చెప్పకున్నా కేసీఆర్,మమత లాంటి ముఖ్యమంత్రులు కూడా బీజేపీ, కాంగ్రెస్ అనే రెండు జాతీయ పార్టీలతో కాకుండా ప్రాంతీయ పార్టీలతోనే కొత్త జట్టును రూపొందించాలని, ఆ విధంగా కట్టుతప్పని స్నేహం ఎన్నికల వరకూ అయినా చేయాలని తలపిస్తున్నారు.అంటే వీళ్లకు కూడా కాంగ్రెస్ శత్రువు అనే కదా! అర్థం.
ముఖ్యంగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలేవీ,బీజేపీకి పోటీ వచ్చే విధంగా ఉన్న మ్యానిఫెస్టోలు అయితే కావు.అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అంటే బీజేపీ భయపడుతోంది అన్నది కొంతలో కొంత అయినా అంగీకారానికి నోచుకోదగ్గ విషయమే! అదే విధంగా రాహుల్ మానియా ఇప్పటికిప్పుడు లేకపోయినా యూపీలో ప్రియాంక ప్రయత్నాలు సఫలీకృతం కాకపోయినా ఇవాళ వారి వారి సన్నాహాలను మాత్రం మనం కించపరచకూడదు.
ఆ విధంగా కించపరచడమో, తక్కువ చేసి చూడడమో అన్నది చేయడంలేదు కనుకనే మోడీ తో సహా ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్ ను అంత సులువుగా తీసుకోవడం లేదు.వారి వారి ప్రయత్నాలను తీసి పడేయడం లేదు. అందుకే నిన్నటివేళ రవిదాస్ జయంతి వేడుకలను రాహుల్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో మోడీ కూడా అంతే స్థాయిలో పరిగణించి వెళ్లారు.
ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ ఉంటుంది అనేందుకు ఇదొక తార్కాణం.ఇక రాహుల్ కూడా ఇప్పుడిప్పుడే పరిణితితో కూడిన రాజకీయాలు నడుపుతున్నారు.తనదైన పంథాలో వెళ్తున్నారు.బీజేపీ నుంచి అవమానాలు కూడా భరిస్తున్నారు.అసోం సీఎం అనరాని మాటలు అన్నా కూడా భరిస్తున్నారు. అదేవిధంగా వాటిని తిప్పి కొట్టే ప్రయత్నంలో కూడా హుందాతనం పాటిస్తున్నారు.ఇవే ఇవాళ రాహుల్ కు ప్లస్ కానున్నాయి.
This post was last modified on February 19, 2022 5:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…