ఆంధ్రా,తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ నియమించిన త్రి సభ్య కమిటీ సభ్యులతో వర్చువల్ మీటింగ్ లో నిన్నటి వేళ పాల్గొన్నా ఫలితాలేవీ ఆశాజనకంగాలేవు.అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే అనుకున్న అజెండాతో మీటింగ్ ప్రారంభం అయినా కూడా అధికారుల స్థాయిలో ఎవరి పంతం వారిదే అన్న విధంగా ఉన్నారు. ఎవరికి వారే తమ మాట నెగ్గించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఏడేళ్ల కాలంలో కేంద్ర హోంశాఖ చూపని చొరవ సడెన్ గా ఇరు రాష్ట్రాల సీఎస్ లతో మాట్లాడాలని అనుకోవడం నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామమే..! కానీ ఆ అవకాశాన్ని ఆ సావధానతను ఇరు రాష్ట్రాల పెద్దలూ వినియోగించుకోలేకపోయారు అన్నది నిన్నటి వేళ తేలిన నిజం.దీంతో ముఖ్యమయిన విషయాల్లో దేనిపై కూడా క్లారిఫికేషన్ రాలేదు.
ఒక పౌర సరఫరాలకు సంబంధించి ఆ రోజు చేపట్టిన ధాన్యం సేకరణకు సంబంధించి ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన నాలుగు వందల కోట్ల రూపాయల విషయంలో తప్ప! దానిపై కూడా తెలంగాణ తనదైన ట్విస్ట్ ఒకటి ఇచ్చింది. విద్యుత్ బకాయిల విషయమై ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.
తమపై బకాయిల విషయమై హైకోర్టులో దాఖలు చేసిన కేసు ఉపసంహరించుకోవాలని పట్టుబట్టింది. విద్యుత్ బకాయిల చెల్లింపులపై ఇరు రాష్ట్రాలు తమదైన వింతడ వాదం వినిపించాయే తప్ప సమస్య పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించలేదు అన్న వాదన అయితే స్పష్టంగానే వినిపిస్తోంది. అదేవిధంగా ఏపీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి అని వాటిపై కూడా దృష్టి సారించాలని పట్టుబడుతోంది తెలంగాణ.ఇంకా కొన్నిఆస్తుల వివాదాలపై కూడా ఏస్పష్టతా ఇవ్వకుండానే నిన్నటి సమావేశం ముగిసింది.
This post was last modified on February 18, 2022 12:35 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…