ఆంధ్రా,తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ నియమించిన త్రి సభ్య కమిటీ సభ్యులతో వర్చువల్ మీటింగ్ లో నిన్నటి వేళ పాల్గొన్నా ఫలితాలేవీ ఆశాజనకంగాలేవు.అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే అనుకున్న అజెండాతో మీటింగ్ ప్రారంభం అయినా కూడా అధికారుల స్థాయిలో ఎవరి పంతం వారిదే అన్న విధంగా ఉన్నారు. ఎవరికి వారే తమ మాట నెగ్గించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఏడేళ్ల కాలంలో కేంద్ర హోంశాఖ చూపని చొరవ సడెన్ గా ఇరు రాష్ట్రాల సీఎస్ లతో మాట్లాడాలని అనుకోవడం నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామమే..! కానీ ఆ అవకాశాన్ని ఆ సావధానతను ఇరు రాష్ట్రాల పెద్దలూ వినియోగించుకోలేకపోయారు అన్నది నిన్నటి వేళ తేలిన నిజం.దీంతో ముఖ్యమయిన విషయాల్లో దేనిపై కూడా క్లారిఫికేషన్ రాలేదు.
ఒక పౌర సరఫరాలకు సంబంధించి ఆ రోజు చేపట్టిన ధాన్యం సేకరణకు సంబంధించి ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన నాలుగు వందల కోట్ల రూపాయల విషయంలో తప్ప! దానిపై కూడా తెలంగాణ తనదైన ట్విస్ట్ ఒకటి ఇచ్చింది. విద్యుత్ బకాయిల విషయమై ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.
తమపై బకాయిల విషయమై హైకోర్టులో దాఖలు చేసిన కేసు ఉపసంహరించుకోవాలని పట్టుబట్టింది. విద్యుత్ బకాయిల చెల్లింపులపై ఇరు రాష్ట్రాలు తమదైన వింతడ వాదం వినిపించాయే తప్ప సమస్య పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించలేదు అన్న వాదన అయితే స్పష్టంగానే వినిపిస్తోంది. అదేవిధంగా ఏపీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి అని వాటిపై కూడా దృష్టి సారించాలని పట్టుబడుతోంది తెలంగాణ.ఇంకా కొన్నిఆస్తుల వివాదాలపై కూడా ఏస్పష్టతా ఇవ్వకుండానే నిన్నటి సమావేశం ముగిసింది.
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…