ఆంధ్రా,తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ నియమించిన త్రి సభ్య కమిటీ సభ్యులతో వర్చువల్ మీటింగ్ లో నిన్నటి వేళ పాల్గొన్నా ఫలితాలేవీ ఆశాజనకంగాలేవు.అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే అనుకున్న అజెండాతో మీటింగ్ ప్రారంభం అయినా కూడా అధికారుల స్థాయిలో ఎవరి పంతం వారిదే అన్న విధంగా ఉన్నారు. ఎవరికి వారే తమ మాట నెగ్గించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఏడేళ్ల కాలంలో కేంద్ర హోంశాఖ చూపని చొరవ సడెన్ గా ఇరు రాష్ట్రాల సీఎస్ లతో మాట్లాడాలని అనుకోవడం నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామమే..! కానీ ఆ అవకాశాన్ని ఆ సావధానతను ఇరు రాష్ట్రాల పెద్దలూ వినియోగించుకోలేకపోయారు అన్నది నిన్నటి వేళ తేలిన నిజం.దీంతో ముఖ్యమయిన విషయాల్లో దేనిపై కూడా క్లారిఫికేషన్ రాలేదు.
ఒక పౌర సరఫరాలకు సంబంధించి ఆ రోజు చేపట్టిన ధాన్యం సేకరణకు సంబంధించి ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన నాలుగు వందల కోట్ల రూపాయల విషయంలో తప్ప! దానిపై కూడా తెలంగాణ తనదైన ట్విస్ట్ ఒకటి ఇచ్చింది. విద్యుత్ బకాయిల విషయమై ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.
తమపై బకాయిల విషయమై హైకోర్టులో దాఖలు చేసిన కేసు ఉపసంహరించుకోవాలని పట్టుబట్టింది. విద్యుత్ బకాయిల చెల్లింపులపై ఇరు రాష్ట్రాలు తమదైన వింతడ వాదం వినిపించాయే తప్ప సమస్య పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించలేదు అన్న వాదన అయితే స్పష్టంగానే వినిపిస్తోంది. అదేవిధంగా ఏపీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి అని వాటిపై కూడా దృష్టి సారించాలని పట్టుబడుతోంది తెలంగాణ.ఇంకా కొన్నిఆస్తుల వివాదాలపై కూడా ఏస్పష్టతా ఇవ్వకుండానే నిన్నటి సమావేశం ముగిసింది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…