ఆంధ్రా,తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ నియమించిన త్రి సభ్య కమిటీ సభ్యులతో వర్చువల్ మీటింగ్ లో నిన్నటి వేళ పాల్గొన్నా ఫలితాలేవీ ఆశాజనకంగాలేవు.అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే అనుకున్న అజెండాతో మీటింగ్ ప్రారంభం అయినా కూడా అధికారుల స్థాయిలో ఎవరి పంతం వారిదే అన్న విధంగా ఉన్నారు. ఎవరికి వారే తమ మాట నెగ్గించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఏడేళ్ల కాలంలో కేంద్ర హోంశాఖ చూపని చొరవ సడెన్ గా ఇరు రాష్ట్రాల సీఎస్ లతో మాట్లాడాలని అనుకోవడం నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామమే..! కానీ ఆ అవకాశాన్ని ఆ సావధానతను ఇరు రాష్ట్రాల పెద్దలూ వినియోగించుకోలేకపోయారు అన్నది నిన్నటి వేళ తేలిన నిజం.దీంతో ముఖ్యమయిన విషయాల్లో దేనిపై కూడా క్లారిఫికేషన్ రాలేదు.
ఒక పౌర సరఫరాలకు సంబంధించి ఆ రోజు చేపట్టిన ధాన్యం సేకరణకు సంబంధించి ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన నాలుగు వందల కోట్ల రూపాయల విషయంలో తప్ప! దానిపై కూడా తెలంగాణ తనదైన ట్విస్ట్ ఒకటి ఇచ్చింది. విద్యుత్ బకాయిల విషయమై ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.
తమపై బకాయిల విషయమై హైకోర్టులో దాఖలు చేసిన కేసు ఉపసంహరించుకోవాలని పట్టుబట్టింది. విద్యుత్ బకాయిల చెల్లింపులపై ఇరు రాష్ట్రాలు తమదైన వింతడ వాదం వినిపించాయే తప్ప సమస్య పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించలేదు అన్న వాదన అయితే స్పష్టంగానే వినిపిస్తోంది. అదేవిధంగా ఏపీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి అని వాటిపై కూడా దృష్టి సారించాలని పట్టుబడుతోంది తెలంగాణ.ఇంకా కొన్నిఆస్తుల వివాదాలపై కూడా ఏస్పష్టతా ఇవ్వకుండానే నిన్నటి సమావేశం ముగిసింది.
This post was last modified on February 18, 2022 12:35 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…