ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తయిపోవడం చూసి అంతా షాకైపోయారు. ఇంత భారీ చిత్రాన్ని ప్రభాస్ ఇంత వేగంగా పూర్తి చేయడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘రాధేశ్యామ్’ ఆలస్యమైనా.. ‘ఆదిపురుష్’ వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోందని సంతోషించారు ప్రభాస్ ఫ్యాన్స్. ముందు అన్న ప్రకారమే ఆగస్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారని ఎగ్జైట్ అయ్యారు.
మార్చి 11కు ‘రాధేశ్యామ్’ ఖరారైన నేపథ్యంలో ఐదు నెలల వ్యవధిలో ప్రభాస్ రెండు సినిమాలతో పలకరించబోతున్నందుకు చాలా సంతోషించారు. తీరా చూస్తే ఇప్పుడు ‘ఆదిపురుష్’ వాయిదా పడటం వారికి నిరాశ కలిగించింది. ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఏప్రిల్ 14 నుంచి ఆగస్టుకు 11కు వాయిదా పడటంతో దాని కోసమని ‘ఆదిపురుష్’ టీం త్యాగం చేస్తూ తమ సినిమాను వాయిదా వేసుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘ఆదిపురుష్’ను ఆగస్ట్ రిలీజ్కు రెడీ చేయడం కష్టమేమీ కాదు.
కానీ ఆమిర్ ఖాన్ అంతటి వాడు అడిగేసరికి ‘ఆదిపురుష్’ దర్శక నిర్మాతలు తమ చిత్రాన్ని వాయిదా వేసుకోవడానికి ఓకే చెప్పేసినట్లున్నారు. మరి ‘ఆదిపురుష్’ కొత్త డేట్ ఏది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని డిసైడైనట్లు సమాచారం. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి దీపావళి పండుగ రోజు సినిమాను రిలీజ్ చేస్తే టైమింగ్ కరెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నారట.
మామూలుగా హిందీలో, తమిళంలో దీపావళికి భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. తెలుగులో సంక్రాంతి, దసరా పండుగల మీద ఉన్నంత ఆసక్తి దీపావళి మీద ఉండదు. ఐతే ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీకి దీపావళే కరెక్ట్ టైమింగ్ అని ఫిక్స్ అయ్యారట. బాలీవుడ్లో చాలా ముందుగానే రిలీజ్ డేట్లు ఖరారవుతుంటాయి కాబట్టి ఆలస్యం చేయకుండా తమ సినిమా విడుదల తేదీని ప్రకటించేయాలని ‘ఆదిపురుష్’ టీం చూస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…